నిరంతరం సత్యాన్వేషణ జరుపుతూ, అనుక్షణం విద్య గరుపుతున్న నిత్య విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన బ్లాగ్ ఇది. ఇందులో నా ఆలోచనలు, భావాలతో పాటు, వివిధ రకాల ఉపయుక్త సమాచారాన్ని పొందుపరుస్తాను, మీ సూచనలు, సలాహాలు సదా అభిలషణీయం. - డా. వేణు మాధవ శర్మ This blog is for the eternal seeker, always striving to learn and grow. I share reflections and insights, blending devotion with wisdom, along with practical guidance for your spiritual and educational path. Dr. M. Venu Madhava Sharma
Translate
Friday, August 28, 2020
కలిపురుషుడు (హిందూ ధర్మం వాట్సాప్ గ్రూప్ నుండి)
ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్య కరమైన విషంయం చూశాడు. ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచుని ఉంటే, దాని ముందు ఆవు ఒకటి నిలబడి పిల్లలగూర్చి జాడ తెలియక బాధపడుచున్న దానివలే ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు " ఎందుకు ఏడుస్తున్నావు మంగళ ప్రదురాలా? " అని ప్రశ్నిస్తుంది. అందుకా ఆవు "నేను ఏడుస్తున్నది నాగురించి కాదు, నేడు ఆశ్రీలలనేశుడి లేమి వలన కాలముచే నీకు ఒంటి కాలయ్యెను కదా!? అని దుఃఖిస్తున్నాను. ఆ కలి ప్రభావముచే దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమలకు బాధ కలుగుతుంది కదా అని బాధ పడుతున్నాను" అంటుంది.
ఒక్క కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదూ? దానిని చూసి ఆవు విలపించడమేమిటీ? అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవూ, ఎద్దులు కాదు. ఆ ఆవు భూదేవి, వృషభం ధర్మ దేవత. కృష్ణ నిర్యాణానంతరం కలియుగం ప్రారంభ సమయంలో కలి ప్రవేశించి నపుడు ఆ కలి పురుషుని ప్రభావం వలన ధర్మము యొక్క ( సత్యము, శౌచము, తపస్సు, దయ అను ) నాలుగు పాదములలో 3 నశించి ఒక్క కాలు మాత్రమే మిగిలినందులకు ఆ భూదేవి విలపించుచున్నది. నశించినవేవి? శౌచము, తపస్సు, దయ అను నవి నశించినవి. మిగిలినది సత్యము. ఇది ఎప్పటికీ నశించదు.
దుష్ట సంగము వలన శౌచము, సమ్మోహము వలన తపస్సు, అహం కారము వలన దయ నశించినవి. అవి నశించుట వలన పైన తెలిపిన 8 మందికీ బాధ కలుగుతుంది.
ఈ విధంగా ఆవు దుఃఖిస్తుండగా అపారమైన కోపం కలవాడు, దండము చేతిలో కలిగినవాడు, రాజు ఆకారంలో ఉన్న వాడు, ఖఠినాత్ముండు అయిన వాడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు. ఆ ఆవు క్రింద పడి పోయినది. ఒంటి కాలు మీద నిలబడిన ఎద్దుని కూడా తన్నాడు. అది కూడా క్రింద పడి పోయినది. క్రింద పడి వాటిని తన చేతిలోని దండముతో విపరీతముగా కొట్టనారంభించాడు. అవి కనులనుండి నీరు కారుతుండగా విలపిస్తున్నాయి.
దూరమునుండి అది చూచిన పరీక్షిత్తు వాటిని సమీపించి ఆ గోవును భూమాతగాను, వృషభమును ధర్మముగాను గుర్తించి అమ్మా మీకీ దీనావస్థ కలుగుటకు కారణము ఎవరు? మీకు మూడు కాళ్లు లేక పోవుటకు కారణము ఎవరు ? ఎంతటి వారైనప్పటికినీ నేను వారి చేతులను ఖండఖండములుగా చేసి మిమ్ము రక్షించెదను సెలవిమ్మని అడిగెను.
అందుకా గోమాత " కొందరు కాలమన్నారు,కొందరు కర్మ అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, యుగ లక్షణమన్నారు. ఏవేవో కారణాలు చెప్పారు, ఏది ఏమైనప్పటికినీ వీరి పాదములు తెగిపోయాయి" అన్నది.
పరీక్షిత్తు ఇందాక గోవును బాధించిన వానిగురించి వెతుకు చుండగా, ఆ నృపాకారుడైన వాడు వచ్చి గభాలున పరీక్షిత్తు పాదాలమీద పడి అయ్యా రక్షించండి నేనే నరికేశాను ఆపాదాలు అన్నాడు. నన్ను కలి పురుషుడంటారు. నా ప్రవేశం వలననే ధర్మమునకు 3 పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు. కానీ నేను ఇంకా సరిగా నా ప్రభావాన్ని చూపకముందే, నీవు నన్ను అవరోధిస్తున్నావు. నేను ఎక్కడికెళితే అక్కడ నీవు ధనుర్భాణాలు పట్టుకు నిల్చుంటున్నావు. అలా కాదు నాకో అవకాశం ఇవ్వు. నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు. నేనక్కడ ఉంటాను. అంతే కానీ నే వెళ్లినచోటల్లా నీవు అండగా నిలబడితే యుగధర్మం నెరవేరదు. ఇది కలియుగం. నేను ప్రవేశించి తీరాలి. కా బట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు. అని వేడుకున్నాడు.
అప్పుడు పరీక్షిత్తు చెప్పాడు. నీకు 4 స్థానాలు ఇస్తున్నాను అక్కడ నీవు ఉండవచ్చు.
1 : జూదశాల యందు నీవు ఉండ వచ్చు.
2 : పాన ( మద్య ) శాలయందు నీవు ఉండవచ్చు.
3 : స్వేఛ్చావిహరిణులై ధర్మమునకు కట్టు బడక ఆచార భ్రష్టులైన స్త్రీల యందు నీవు ఉండవచ్చు.
4 : జీవ హింస జరిగే టటువంటి ప్రదేశములయందు నీవు ఉండవచ్చు.
అది విని కలిపురుషుడు అయ్యా మీరు నాలుగుస్థానాలిచ్చారు. కానీ వాటయందు నేను నిలబడడానికి వీలుకలిగేటట్టు లేదు. ( పరీక్షిత్తు పరిపాలనలో ప్రజలెవ్వరూ వాటి జోలికి వెళ్లరు కనుక ) నాకు ఇంకొక్క స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు.
అందుకు పరీక్షిత్తు
5 : బంగారం ఇచ్చాను అన్నాడు. అది అన్యాయంగా సంపాదించిన బంగారం.
అది విని చాలు మహాప్రభో చాలు అని నమస్కరించి వెళ్లి పోయాడు కలిపురుషుడు.
జరాశాంధుడు ఎంతోమంది రాజులను చంపి వారి నుండి అన్యాయంగా సంపాదించిన బంగారం తో ఒక కిరీటం ను తయారు చేస్తారు. అతన్ని భీముడు ఓడించిన తర్వాత ఆ కిరీటం కూడా ధర్మరాజు ఖజానా లోకి వస్తుంది. కానీ భగవంతుడు ఉన్నంత వరకు దాని గురించి ఎవ్వరూ పట్టించుకోరు.
అదే కిరీటం ను ఇప్పుడు పరిక్షిత్ మహారాజు వేసుకుంటారు.
అలా కలి పరీక్షిత్తు నందు ప్రవేశించాడు. పరీక్షిత్తు ఆ ప్రభావంతో వేటకి ( అహింస కు ) వెళ్లి, అక్కడ తపస్సునందు నిమగ్నుడైన శమీక మహాముని పై చచ్చిన పామును వేస్తాడు. అది తెలిసి శమీక మహర్షి కుమారుడు శృంగి కోపోగ్రుడై "ఏడురోజులలో తక్షకుని చేతిలో మరణించమని" పరీక్షిత్తును శపించడము, రాజ్యానికి తిరిగి వచ్చినతరువాత తన తప్పు తెలుసుకున్న పరీక్షిత్తు పశ్
చాత్తాప హృదయుడై ఉండగా శుకుడు వచ్చి భాగవతమును ఏడురోజులలో వినిపిస్తాడు.
కావున పై 5 విషయములందును కలి పురుషుని ప్రభావం ఉండును. వీనిలో దేనికి లోనైననూ మనం నైతికంగా పతనమవుతాము. భగవంతునికి దూరమవుతాము. కలి ప్రభావమునుండి భగవన్నామము ఒక్కటే మనను రక్షించ గలదు.
రావిచెట్టును ఎందుకు పూజించాలి? (హిందూ ధర్మం వాట్సాప్ గ్రూప్ నుండి)
అశ్వత్థ వృక్షం అంటే రావిచెట్టు. రావిచెట్టును త్రిమూర్తి స్వరూపం అంటారు. అంటే ఆ వృక్షంలో త్రిమూర్తులూ కొలువై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ అశ్వత్థ వృక్షం మహిమను గూర్చి బ్రహ్మాండపురాణంలో శ్రీ నారదమహర్షి ఇలా చెప్పారు. అశ్వత్థమే_నారాయణ_స్వరూపం.
ఆ వృక్షము యొక్క మూలమే బ్రహ్మ. దాని మధ్య భాగమే విష్ణువు, వృక్ష చివరి భాగమే ఈశ్వరుడు. కావుననే త్రిమూర్తులను పూజించినట్లే భావిస్తూ…అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేస్తూ మనం ఈ క్రింది శ్లోకం స్మరించుకోవాలి.
శ్లోకం: మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతో విష్ణురూపిణే
అగ్రతో శివ రూపాయ
వృక్షరాజాయ తే నమోనమః
అలాగే త్రిమూర్తులు అశ్వత్థ వృక్షానికి దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులలోని కొమ్మలు. తూర్పుదిక్కు కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు. దాని వేళ్ళలో మహర్షులు, గోబ్రాహ్మణులు, నాలుగు వేదాలు ఉంటాయి. సప్తసముద్రాలు, పుణ్యనదులు తూర్పుకొమ్మలలో ఉంటాయి. ఈ వృక్షం యొక్క మూలంలో ‘అ’కారము, మానులో ‘ఉ’ కారము, దాని పండ్లు ‘మ’ కారము. ఆ వృక్షమంతా కలసి ప్రణవస్వరూపమే.
అశ్వత్థ వృక్షాన్ని సేవించే విధానం
అశ్వత్థ (రావి) చెట్టు సాక్షాత్తూ కల్పవృక్షమే. ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానాన్ని తెలియచేస్తూ నారదమహర్షులవారు నుడివిన విషయం ఏమిటంటే శుభసుముహూర్తంలో స్నానాదులు పూర్తిచేసి శుచియై ప్రారంభించాలి. ప్రవహిస్తున్న నీటిలో స్నానంచేసి ఉతికిన బట్టలు ధరించి విభూతిధారణ గాని, కుంకుమధారణ గాని చేయవలెను.
మొదటగా గణపతిని పూజించి సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో ఏడుసార్లు అభిషేకం చేయాలి. దేవతామయమైన ఆ వృక్షానికి షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని ఎనిమిది బాహువులు గలవానిగా భావించి ధ్యానించాలి.
తరువాత విష్ణుసహస్రనామం చదువుతూ గాని, మౌనంగా గాని, నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి మొదట, చివర నమస్కారాలు చేయాలి. త్రికరణశుద్ధిగా దృష్టి నిలిపి చేసినట్లయితే మంచి ఫలితం లభిస్తుంది. ఆది, మంగళవారాల్లో అశ్వత్థమును తాకకూడదు. అంతే కాకుండా సంధ్య వేళల్లో కూడా ముట్టుకోకూడదు. అశ్వత్థాన్ని
కోణస్థః పింగళోబభ్రుః
కృష్ణో రౌద్రాంతకోయమః |
శౌరిశ్వనైశ్వరోమందః
పిప్పలా దేవసంస్తుతః ||
అనే మంత్రం దృఢ విశ్వాసంతో జపిస్తే శనిదోషం కూడా తొలగి అభీష్ఠసిద్ధి కలుగుతుంది. గురువారం అమావాస్య కలసినరోజున రావిచెట్లు నీడన స్నానంచేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేదవిప్రునికి మృష్ఠాన్నం పెడితే కోటి బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం లభిస్తుంది.
ఆ చెట్టునీడన గాయత్రీ మంత్రజపం చేస్తే నాలుగు వేదాలు చదివిన ఫలితం. రావిచెట్టును స్థాపిస్తే నలభైరెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది. కొట్టవేయడం మహాపాపం.
Subscribe to:
Comments (Atom)