హిందూ పురాణాల ప్రకారం మధ్య వేలు శని స్థానం. ఈయన జీవితానికి భద్రత కలిగిస్తాడు. కాబట్టి మధ్యవేలితో నుదుటిపై తిలకం ధరిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది.
ఉంగరపు వేలు సూర్య స్థానం. అందుకే ఈ వేలుతో నుదుటన బొట్టు పెట్టుకుంటే మనశ్శాంతి. అంతేకాదు సూర్యుడి తేజస్సు, శక్తి కలుగుతాయి. అలాగే
ఉంగరపు వేలుతో తిలకధారణ చేస్తే నుదుటిపై ఉండే ఆఙ్ఞా చక్రం ఉత్తేజితమై, మనిషి మేధస్సును మేల్కొల్పడానికి సహాయపడుతుంది. అందుకే దేవుడికి ఈ వేలుతోనే తిలకధారణ చేస్తారు.
పురాణాల ప్రకారం
బొటన వేలు శుక్ర స్థానం. ఈ గ్రహం ఆరోగ్యం ప్రసాదిస్తుంది. కాబట్టి బొటనవేలుతో తిలకం దిద్దుకుంటే ఆరోగ్యం, శక్తి కలుగుతాయి.
చూపుడు వేలు బృహస్పతి స్థానం. మరణించిన వారికి మాత్రం ఈ వేలుతో తిలకం దిద్దితే మోక్షం ప్రాప్తిస్తుంది. అమరత్వాన్ని కలిగించేది బృహస్పతి గ్రహం. అందుకే మిగతా సందర్భాల్లో చూపుడువేలుతో నుదుటిపై బొట్టు పెట్టడాన్ని అపవిత్రంగా భావిస్తారు.
No comments:
Post a Comment