Translate

Thursday, December 19, 2019

అమ్మవారి అర్చనలు

మానవుడు చేసిన కర్మలనునసరించి వారికి సద్గతులు అమ్మవారు కలిగిస్తుంది, సాధకుని యొక్క సాధనను బట్టి అన్నిరకాల ముక్తులను ప్రసాదించే తల్లి ఆ  ముక్తి 5 రకాలు గా వర్ణించ బడింది.

1.మణిపూరంలో దేవిని అర్చించే వారికి “సార్షిరూపముక్తి”.(మణిపూరంలో దేవిని అర్చించేవారు దేవి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకుని ఉంటారు. దీన్ని సార్షిరూపముక్తి అంటారు.)

2.అనాహతంలో దేవిని అర్చించేవారికి “సాలోక్యముక్తి”(అనాహతంలో దేవిని అర్చించేవారు దేవిపట్టణంలోనే నివసించగలుగుతారు.
దీన్ని సాలోక్యముక్తి అంటారు.)

3.విశుద్ధిచక్రంలో దేవిని అర్చించే వారికి 'సామీప్యముక్తి” (విశుద్ధిచక్రంలో దేవిని అర్చించేవారు దేవికి అతిదగ్గరగా సేవకులుగా ఉంటారు.
ఇది సామీప్యముక్తి.)

4.ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించే వారికి “సారూప్యముక్తి”(ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించేవారు వేరే దేహం ధరించి దేవితో సమానమైన
రూపంలో ఉంటారు. ఇది సారూప్యముక్తి.)

5.సహస్రారంలో దేవిని అర్చించే వారికి “సాయుజ్యము”(సహస్రారంలో దేవిని అర్చించేవారు జన్మరాహిత్యం పొందుతారు. వీరికి మరుజన్మ
ఉండదు. ఇది శాశ్వతమైన ముక్తి. సాయుజ్యం.
లభిస్తాయి.)

ఇవేకాక భక్తులకు వారివారి కర్మానుసారము స్వర్గనరకాలు ప్రాప్తిస్తాయి.

స్వర్గసుఖాలు ఎంతకాలం అనుభవించాలి ? తిరిగి ఎప్పుడు జన్మించాలి ? అనేది
నిర్ణయించేది కూడా ఆ పరమేశ్వరీ. ఈ రకంగా ఆ దేవి మానవులకు సద్దతులను ప్రసాదిస్తుంది.

పద్మపురాణంలో చతుర్దశినాడు మూడు కాలములందు దేవిని ఎవరైతే పూజిస్తారో వారు పరాస్థానము పొందుతారు అని చెప్పబడింది.

ఈ విధంగా సాధకుడు చేసే అర్చనా విధానాన్ని బట్టి అతడికి ముక్తి లభిస్తుంది.

🕉️పంచబ్రహ్మలు దేవికి అతి సమీపంలో ఉండి ఆమెను సేవించాలి అనుకున్నటువంటి వారై,
బాగా ఆలోచించి సామీప్యముక్తి పొందినట్లైతే దేవికి అతిసమీపంగా ఉండి ఆమెను
సేవించవచ్చు అని తలపోసి, విశుద్ధిచక్రంలో ఆమెను ఉపాసించారు. అందువల్ల దేవికి
సేవకులుగా, అత్యంతదగ్గరగా ఆమె యొక్క సింహాసనానికి కోళ్ళుగా ఉండగలిగారు.

ఈ విషయాన్ని శంకరభగవత్సాదుల వారు తమ సౌందర్య లహరిలోని 92వ శ్లోకంలో
వర్ణిస్తూ
గతా స్తే మఞ్చత్వం - ద్రుహిణహరిరుద్రేశ్వరభృతః*
*శివస్స్వచ్ఛచ్ఛాయా - కపటఘటిత ప్రచ్ఛదపటః|*
*త్వదీయానాం భాసాం - ప్రతిఫలనరాగారుణతయా*
*‌శరీరీ శృంగారో - రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్‌||92||*

ఓ భగవతీ ! బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అనే నలుగురు నీవు కూర్చునే
సింహాసనానికి కోళ్ళుకాగా సదాశివుడు నువ్వు కప్పుకునే దుప్పటి అయినాడు.
శ్రీచక్రంలో 5 ‌శక్తిచక్రాలు, 4 శివచక్రాలు ఉన్నాయి. ఇందులోని శక్తిచక్రాలే
పంచబ్రహ్మలు. ఈ శక్తిచక్రాలకు పైన దేవి ఉంటుంది. కాబట్టి ఆమె పంచబ్రహ్మాసనస్థితా అనబడుతోంది.
మానవశరీరంలో షట్బక్రాలున్నాయి. ఆ చక్రాలలో ప్రతిదానికీ అధిదేవతలున్నారు.

ఆధారచక్రానికి అధిదేవత - గణపతి
స్వాధిష్టానానికి అధిదేవత - బ్రహ్మ
మణిపూరానికి అధిదేవత - విష్ణువు
అనాహతానికి అధిదేవత - రుద్రుడు
విశుద్ధిచక్రానికి అధిదేవత - మహేశ్వరుడు
ఆజ్ఞాచక్రానికి అధిదేవత - సదాశివుడు

వీటన్నింటికీ పైన సహస్రారంలో ఆ పరమేశ్వరి ఉంటుంది. కాబట్టి ఆమె
పంచటబ్రహ్మాసనస్థితా అని చెప్పబడుతోంది.
 
తనకున్నంతలో పుష్కలంగా పూజాద్రవ్యాలు తెచ్చి పరమేశ్వరిని అర్చించినవాడు శివసాన్నిధ్యం పొందుతాడు.

సద్గతులు రెండు రకాలు 1. ఇహము 2. పరము. ఐహికమైన వాంఛలతో పరమేశ్వరిని అర్చించిన వాడికి భోగభాగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి.

🕉️"దుర్వాస మహర్షి శ్రీచక్ర పూజాఫలాన్ని చెబుతూ"

ఆశానాం పూరకం చక్రం అర్చకానాం అహర్నిశం

ఆ దేవిని ఏ కోరికతో అర్చిస్తే అది తీరుతుంది. ఈ జగత్తులో ఇహం కావాలి అంటే పరం ఉండదు. పరం కావాలంటే ఇహం ఉండదు. అనగా భోగభోగ్యాలు కావాలి అంటే ముక్తి ఉండదు. అలాగే ముక్తికావాలంటే భోగభాగ్యాలను త్యజించాలి.

యత్రా పిభోగో న చ తత్ర మోక్షః యత్రా పి మోక్షోన చ తత్ర భోగః |

శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ ॥

కాని పరమేశ్వరిని అర్చించిన వారికి భోగము, మోక్షము ఏది కావాలంటే అది దొరుకుతుంది.

ఈ జగత్తులో చతుర్దశభువనాలున్నాయి. అందులో భూలోకానికి పైన ఆరు లోకాలున్నాయి. మానవుడు చేసిన కర్మ ఆధారంగా అతడు పైలోకాలకుపోతాడు. అవన్నీ సద్గతులే.

మానవుడు తాను చేసిన కర్మఫలాన్ని బట్టి ఉత్తరజన్మ పొందుతాడు. లోకంలో 84 లక్షల రకాల జీవరాసులున్నాయి. క్రిమికీటకాలు, పశువులు, పక్షులు, జంతువులు, మృగాలు, కుక్కలు, పిల్లులు చివరకు మానవుడు అన్ని జన్మలలోకి మానవజన్మ
దుర్లభమైనది.

Monday, December 16, 2019

శివ ప్రదక్షిణ విధానము

వృషం చండం వృషంచైవ సోమసూత్రం పునర్వ్రుషమ్ । 
చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వ్రుషమ్ ॥ 
శివ ప్రదక్షిణే చైవ సోమసూత్రం న లంఘయేత్ । 
లంఘనాత్సోమసూత్రస్య నరకే పతనం ధ్రువమ్ ॥

విశేష ఫలితములను అనుగ్రహించు శ్రీ శివ ప్రదక్షిణ విధానము :

ధ్వజస్తంభము నుండి సవ్యంగా చండీశ్వరుని వద్దకు వెళ్ళి నమస్కరించవలెను.
మరల, ధ్వజస్తంభము వద్దకు వచ్చి నమస్కరించుకొని, సోమసూత్రము వరకు వెళ్ళవలెను.
అదే విధంగా, ధ్వజస్తంభము వద్దకు వచ్చి నమస్కరించుకొని, చండీశ్వరుని చేరవలెను.
మరల ధ్వజస్తంభము మీదుగా (మధ్యలో ఆగకుండా) సోమసూత్రమును చేరవలెను.
అదే విధంగా, ధ్వజస్తంభము మీదుగా (మధ్యలో ఆగకుండా) చండీశ్వరుని చేరి నమస్కరించవలెను.
మరల, ధ్వజస్తంభము వద్దకు వచ్చి నమస్కరించుకోనిన  ప్రదక్షిణ పూర్తి యగును.
(ధ్వజస్తంభము లేని యడల, నందీశ్వరుని నుండి ఈ ప్రదక్షిణ చేయవచ్చును.)
శివ ప్రదక్షిణ చేయునప్పుడు సోమసూత్రమును దాటరాదని తెలిసికొనవలెను.
జగత్కళ్యాణ కారకులైన శ్రీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము చేత, జనులందరూ ధర్మాచరణ కల్గినవారై, ఆనందమగు జీవితమును పొందుదురు గాక !
విశ్వస్య కళ్యాణమస్తు :)

శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రం


ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

గంగాధరం మహాదేవం సర్పాభరణ భూషితం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

అనాధ పరమానందం కైవల్యపద గామినం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

స్వర్గాపవర్గ దాతారం సృష్టి స్థితి వినాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఉత్పత్తి స్థితి సంహార కర్తారం గురుమీశ్వరం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తస్య మృత్యు భయం నాస్తి- నాగ్నిచోరభయం క్వచిత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శతావర్తం ప్రవర్తవ్యం సంకటే కష్ట నాశనం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధి ప్రదాయకం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

జన్మ మృత్యు జరారోగైః పీడితం కర్మ బంధనైః
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తావతస్త్వద్గత ప్రాణః త్వచ్చిత్తోహం సదామృడ 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యం మనుం జపేత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నమశ్శివాయ సాంబాయ హరయే పరమాత్మనే
ప్రణత క్లేశనాశాయ యోగినాం పతయే నమః ||

మృకండు సూను మార్కండేయ కృత
మృత్యుంజయ స్తోత్రం సంపూర్ణమ్.

Saturday, December 14, 2019

పుట్టినరోజు నాడు పఠించవలసిన శ్లోకం (సప్త చిరంజీవులు)


అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః |
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః ||

అశ్వత్థామా, బలిచక్రవర్తి, వ్యాసుడూ (కృష్ణద్వైపాయనుడు) హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీరు ఏడుగురు చిరంజీవులు. హనుమంతుడు భవిష్య బ్రహ్మ; బలి చక్రవర్తి భవిష్య ఇంద్రుడు.

1.   *అశ్వద్దామ* :- ద్రోణాచార్యుని కుమారుడు,మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు. ఇతడు చిరంజీవి.

2. *బలి* :- ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు,ఇంద్రుని జయించినవాడు,వామనమూర్తి కి మూడడుగుల భూమిని దానం చేసి,అతని చే పాతాళమునకు తొక్కబడిన వాడు . కానీ ఇతని సత్య సంధతకు మెచ్చుకున్న వామనుడు గధాధారిగా ఇతని వాకిటికి కావాలి కాచేవాడు .ఇతడు చిరంజీవి. ఇతని సత్య సంధతకు మెచ్చిన మహా విష్టువు ఈమన్వన్తరములో దైత్త్యేద్రత్వమును , పై మన్వంతరములో దేవేంద్ర పదవిని అనుగ్రహించాడు .

3 *వ్యాసుడు* :- సత్యవతీ పరాసరుల కుమారుడు.కృష్ణ ద్వాయపాయనముని అని పిలవబదేవాడు. అష్టదశాపురాణాలను, బ్రహ్మసూత్రములను,భారత భాగవతములను ఇంకనూ అనేక తత్వ గ్రంధములను రచించాడు. వేదాలను విడబరచిన వానిని వ్యాసుడు అని పేర్కొంటారు. ఒక్కొక్క యుగములో ప్రశంసింప బడినారు .

4. *హనుమంతుడు* :- కేసరి భార్య అగు అంజన పుత్రుడే హనుమంతుడు. భర్త ఆజ్ఞా ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో వున్నా శివుని శక్తిని ఆమెకు ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టినాడు .సూర్యుని శిష్యుడు ఈ రామ భక్తుడు .పరమేశ్వరుని అవతారముగా కొలవబదినవాడు హనుమంతుడు .రావణాది రాక్షసులను ఎదిరించి, సీత ఉనికిని తెలుసుకొని లంకేస్వరుని హతమార్చతంలో శ్రీ రామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమ .మహా భారతయుడంలో అర్జునిని ధ్వజమున వెలసి పాండవుల విజయమునకు కూడా దోహదకారి అయినాడు .ఇతడు చిరంజీవుడు .రామ భాక్తాగ్రేస్వరుడైన ఆంజనేయుడు చిరంజీవిగా తన భక్తులకు సకల శుభాలను అనుగ్రహిస్తూ ఉంటాడు.

5. *విభీషణుడు* :- కైకసికిని విస్వబ్రహ్మకు కలిగిన మూడవ కుమారుడు . బ్రహ్మపరమున ఈతడు సుశీలుడైనాడు. ఈయన భార్య పరమ అనే గాంధర్వ స్త్రీ .రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి , సన్మార్గము గూర్చి చెప్పేవాడు .సముద్రమును దాటుటకు శ్రీ రామునకు ఉపాయము చెప్పినవాడు .రావణుని హతమార్చుటకు ఉపాయము చెప్పినవాడు.రావణుని అనంతరం లంకాధిపతి అయినాడు.ఇతడు చిరంజీవుడు.

 6 *కృపుడు* :- శరద్వంతుని కుమారుడు .శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు ,ఇంద్రుడు ఇతని తపస్సును భగ్నము చేయుటకై ఒక అప్సరసను పంపినాడు .ఆమెను చూడగానే యితడు కామ పరవశుడై ఆ చోటును వొదిలి మరియొక చోటుకు వెళ్ళినాడు ఆ సమయమున కల్గిన కుమారుడు కృపుడు . కృపునితో పాటుగా సరద్వాన్తునికి మరియొక ఆడపిల్ల కల్గినది .ఆపిల్లలను వదిలి తపస్సుకి మరిఒక చోటికి వెళ్ళినాడు .అటువంటి సమయమున వేటకు వచ్చిన శంతనుడు .ఈ పసికందులను చూచి కృపతో పెంచినాడు .అందులకే వీనికి క్రుపయని క్రుపుదని పేర్లు వచ్చినవి.శరద్వంతుడు కృపునకు ఉపనయాదికములను చేసి ధనుర్వేదమును నేర్పినాడు .భీష్ముని కోర్కె మన్నించి ధర్మజాడులకు ధనుర్విద్యను నేర్పినాడు .భారత యుద్ధం లో దుర్యోధనుని పక్షమును నిలిచి యుద్ధం చేసినాడు . యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు. దృతరాష్ట్రుడుతో కూడి తపోవనమునకు వెళ్ళినాడు రాబోవు సుర్యసవర్నిక మన్వంతరములో సప్తరుషులలో కృపునకు ఒక స్థానము పొందు వాడుగా వున్నాడు .ఇతడు చిరంజీవుడు.

 7. *పరశు రాముడు* :- ఇతడు రేణుకా జమదగ్నుల కుమారుడు .తండ్రి ఆజ్ఞను మన్నించి తల్లిని కూడా సంహరించినాడు.ఇతనిని మెచ్చుకొన్న తండ్రి వరం కోరుకొమ్మనగా తల్లిని బ్రతికించమన్నాడు .తన సోదరులకు తండ్రివలన శాపమును తొలగింప చేసాడు జమదగ్నికి తాత బృగు మహర్షి ,ఆ మహర్షి ఉపదేశంతో హిమాలయమునకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేసినాడు .ఈశ్వరుడు బోయవాని వేషమున వొచ్చి పరశురాముని పరీక్షించినాడు .శివుని ఉత్తర్వుతో తీర్ధ యాత్రలు చేసినాడు ,శివ అనుగ్రహముతో భార్ఘవాస్త్రమును పొందినాడు

నిత్యం వీరిని స్మరించడం వల్ల ఆనందంగా వందేళ్ళు జీవిస్తారు. ఎనిమిదో వానిగా మార్కండేయున్ని స్మరించడం ద్వారా మృత్యు భయం వీడిపోతుంది

Friday, December 13, 2019

చండీహోమం

చండీహోమం ఎవరికి సంబంధించినది.

ఇది బ్రాహ్మణులకి..మాత్రమే..కాదు..
అన్ని వర్ణాల వారికి..సంబంధించినది.

చండీ ఆరాధన కలకత్తా దగ్గరలోని గిరిజన జాతులవారు ప్రారంభించారని పెద్దలు చెప్పియున్నారు,
వారి వద్ధనుండే చండీహోమం ఆరాధన,,హోమం బయల్పడినాయి.
కాలక్రమేణా బ్రాహ్మణులు,,పండితులు కూడా చండీహోమం చేయనారంభించారు. 

లక్ష్మీ,,సరస్వతీ,,పార్వతీదేవి,,ఈ ముగ్గరు శక్తుల కలయికతో ఏర్పడినదే మహాచండీ..
ఈమె హోమం చేయడంవల్ల సమస్త బాధలు నివారణమవుతాయి.
వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.
శత్రువులు నశిస్తారు.
పరప్రయోగాలతో బాధపడేవారు..
తరచుగా కుటుంబంలో మరణాలు సంభవిస్తున్నవారు..
అకారణంగా కోర్టు  కేసులలో ఇరుక్కుంటున్నవారు.
ఇంకేమైనా ఇతరత్రా సమస్యలతో బాధపడతున్నవారు చండీహోమాన్ని చేయించుకోవడం వల్ల చండీమాత అనుగ్రహంతో త్వరితగతిని వాటినుండి బయటపడతారు,, 

చండీమాత ఉగ్రరూపమే కాళికామాత,,
ఈమె శాంతరూపంలో.. 
మంగళచండి,
సంకటచండీ,,
రణచండీ,,
ఓరైచండీ గా 
పూజలందుకుంటారు..  
చండీహోమం ఈరోజున చాలా ఖర్చుతో కూడుకుని ఉన్నది,, 

ప్రముఖ దేవాలయాలలో చేయించుకునే చండీహోమం వల్ల కేవలం 5% మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. ఎవరైనా చేయించుకునే ఆర్థికస్తోమత ఉన్నవారు ఎవరికివారుగా..
ఆర్థికస్తోమత తక్కువగా ఉన్నవారు నాలుగు కుటుంబాలవారు కలిసికట్టుగా గాని చండీహోమం చేయించుకోవచ్చు,, 

చండీ హోమము ఎందుకు చేయాలి..!
అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే.! 
చండీ మాత ఓ ప్రచండ శక్తి. 
భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. 
సృష్టి జరగడానికి, 
అది వృద్ధి చెందడానికి, 
తిరిగి లయం కావడానికి 
అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. 

ఆమె ఆదిశక్తి, 
పరాశక్తి, 
జ్ఞానశక్తి, 
ఇచ్చాశక్తి, 
క్రియాశక్తి, 
కుండలినీ శక్తి! 
అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం.

లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. 
లోక కల్యాణం కోసం, 
విశేష కార్యసిద్ధి కోసం 
సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు 
మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం 
అనాదిగా వస్తోంది. 
ఆదితత్త్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య.

అది లలితా పారాయణం, 
చండీ పారాయణం 
అని రెండు రకాలు. 

బ్రహ్మాండ పురాణం, 
దేవీ భాగవతం 
లలితాదేవి మహిమలను చెబితే, 
మార్కండేయ పురాణం 
చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. 

చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతోపాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి.

చండీ హోమం లో ఉన్న మంత్రాలు & అధ్యాయాలు.

చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే, ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, 
అర్థశ్లోక, 
త్రిపాద శ్లోక 
మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. 

బ్రాహ్మీ, 
నందజా, 
రక్తదంతికా, 
శాకంబరీ, 
దుర్గా, 
భీమా, 
భ్రామరీ 
అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహత్య్మ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి 
దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది. 
ఇది శాక్తేయ హోమం కనక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది.

దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా, 
13 అధ్యాయాలుగా ఉంటుంది. 
తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 
రెండో భాగంలో మూడు అధ్యాయాలు, 
మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, 
మహిషాసుర సంహారం, 
శుంభనిశుంభుల వధతోపాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. 

సప్తశతిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు. 
పూజ, 
పారాయణ, 
హోమం. 
ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. 
పారాయణలో దశాంశం హోమం, 
దశాంశం తర్పణం ఇస్తారు. 

చండీ హోమానికి సంబంధించి..
నవ చండీ యాగం, 
శత చండీ యాగం, 
సహస్ర చండీ యాగం, 
అయుత (పది వేలు) చండీ యాగం, 
నియుత (లక్ష) చండీ యాగం, 
ప్రయుత (పది లక్షలు) చండీ యాగం ఉంటాయి.

చండీ పారాయణ వలన సమాజానికి జరిగే మేలు:💐
ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. 
దుఃఖం అనేది రాదు. 
ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. 
లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది.

కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. 
ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, 
గ్రహాల అనుకూలతకు, 
భయభీతులు పోవడానికి, 
శత్రు సంహారానికి, 
శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు.

వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట.

ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని, 

ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, 

మను చండి (చతుర్దశ చండి)తో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. 

ఇక, శత చండి చేస్తే కష్టాలు, 
వైద్యానికి లొంగని అనారోగ్యం, 
ధన నష్టం తదితరాలు తొలగుతాయి. 

సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. 
కోరికలు నెరవేరతాయి. 

లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. 
దీనినే నియుత చండి అంటారు. 
ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు..

Wednesday, December 11, 2019

దత్త జయంతి

దత్త జయంతి

శ్రీమహావిష్ణువు ఇరవై ఒక్క అవతారాల్లో దత్తావతారం ఆరోదని భాగవత పురాణం చెబుతోంది. దత్తరూపం అసామాన్యమైంది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించి, ఆవిర్భవించినదే దత్తావతారం. మార్గశిర శుద్ధ పూర్ణిమనాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. ‘దత్తం’ అంటే ఇచ్చినవాడని. అత్రి కుమారుడు కావడంతో ఆత్రేయుడైనాడు. దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. ఇరవై నలుగురిని తన గురువులుగా భావించి, సేవించాడు. కార్తవీర్యుడు, పరశురాముడు, యదువు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోకప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్య బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు మొదలైన గ్రంథాలు రచించాడు.

దత్తుడు గొప్ప అవధూత. మహాజ్ఞాని. చిరంజీవి. యుగయుగాలకు ఆయన ఆదర్శమూర్తి. లోకగురువైనాడు. ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేశాడు. జాతి శ్రేయస్సుకోసం జ్ఞానబోధ చేశాడు. దత్తాత్రేయుడు ఆదిగురువైన పరబ్రహ్మ స్వరూపుడు. శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్యరూప విలక్షణమూర్తి. ఆయన బోధలు లోకకల్యాణ కారకాలు. భూమి నుంచి సహనశీలత, గాలినుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం నేర్చుకోవాలని ఉద్బోధించిన మార్గనిర్దేశకుడు. అగ్నినుంచి నిర్మలత్వాన్ని, సముద్రం నుంచి గాంభీర్యాన్ని, కపోతంనుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలన్నాడు. కొండచిలువలా భ్రాంతిలో పడకూడదన్నాడు. స్పర్శకు దూరంగా ఉండటం మిడత నుంచి, ఏనుగు నుంచి పట్టుదల, చేపనుంచి త్యాగచింతన నేర్చుకోవాలి. మానావమానాలకు సమస్పందన అలవరచుకోవాలి. సాలెపురుగు నుంచి సృష్టి స్థితిలయకారకుడు పరమాత్మేనని తెలుసుకోవాలి. సీతాకోక చిలుకలా ఆత్మానందాన్వేషణ అలవరచుకోవాలి. చంద్రుడి నుంచి వృద్ధిక్షయాలు శరీరానికే కాని ఆత్మకు కావని గ్రహించాలి. ఆర్తులను కాపాడే చింతనను నీటినుంచి గ్రహించాలి. చీమలా జిహ్వ చాపల్యానికి లోనుకారాదని తెలుసుకోవాలి. ఇవన్నీ తనకు గురువులుగా ప్రకటించిన జ్ఞానానందమయుడు- జగద్గురువు దత్తాత్రేయ స్వామి!

దత్తాత్రేయుడు సతీమదాలస ముద్దులపట్టి అలర్కుడికి యోగవిద్య నేర్పాడు. ఓంకారోపాసనా విధానాన్ని ప్రబోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యను, ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞాన రహస్యాన్ని ప్రసాదించాడు. త్రిమూర్తుల అనుగ్రహ అవతారం కావడంతో, దత్తుడిరూపం మూడు శిరసులతో సందేశాత్మకమై ప్రకాశిస్తోంది.

దత్తుడు పదహారు అంశలు కలవాడని ‘దత్తపురాణం’ చెబుతోంది. శ్రీపాదవల్లభులు, శ్రీనృసింహ సరస్వతి, శ్రీ అక్కల్‌కోట మహరాజ్‌, శ్రీమాణిక్య ప్రభువు, షిరిడీ సాయిబాబా, గజానన మహరాజ్‌, శ్రీకృష్ణ సరస్వతీ మహరాజ్‌, వాసుదేవానంద సరస్వతీ మహరాజ్‌ దత్తావతారాలుగా వెలసినట్లు దత్తచరిత్ర చెబుతోంది. దత్తపురాణ గ్రంథాన్ని దీక్షగా పారాయణం చేస్తారు.

మత్స్య పురాణం, స్మృతి కౌస్తుభంలో దత్తచరితం విస్తృతంగా ఉంది. ఈ పూర్ణిమనాడు కొన్ని ప్రాంతాల్లో చంద్రపూజ చేస్తారని నీలమత పురాణం వివరిస్తోంది. ఈ రోజున ఆగ్నేయ పురాణ గ్రంథం దానం చేస్తే సతతం మేలు కలుగుతుందని పురాణోక్తి. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి ‘కోర్ల పూర్ణిమ’గా ప్రసిద్ధి చెందింది. మహామార్గశీర్ష పేరుగల ఈ పున్నమిరోజున నరకపూర్ణిమావ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి హారాష్ట్రలో దత్తజయంతిని భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకొంటారు. దత్తుడు ‘ఉగ్రదేవత’ అని గర్గసంహిత చెబుతోంది. దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికర దినమని చెబుతారు. ఆ స్వామికి ఇష్టమైన వృక్షం మేడివృక్షం. ప్రేమ, అహింస, భూతదయ, త్యాగశీలత, ఆత్మజ్ఞానం మనుషులకు రక్షణ కవచాలన్న దత్తాత్రేయుడి సందేశాలు సర్వదా ఆచరణీయం.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Sunday, December 8, 2019

రోగ నిరోధక మంత్రాలు

రోగ నిరోధక మంత్రాలు కూడా ఉంటాయా ఇప్పటి రోజుల్లో అనీ అనుకోవచ్చు..కానీ  నిజం..
రోగ  నిరోధక మంత్రాలు కచ్చితంగా ఉన్నాయి.
అసలు మంత్రం అనేది ఎలా నిర్మించ బడినది 
ఒకదానికి ఒకటి ఒక ఫార్ములా లాగా పనిచేసే విధంగా నిర్మించ బడినది, 

మంత్రం చదివేటప్పుడు ఆ శబ్దనికి ప్రతిస్పందించే ప్రకృతిలోని కొన్ని శక్తులు మన శరీరాన్ని ఆకర్షిస్థాయి..
అప్పుడు మనకు రోగ నిరోధక శక్తి మనో ధైర్యం, 
బలం లభిస్తుంది..

ఒకప్పుడు వైద్యులు ఔషధం తో పాటు ఒక మంత్రం కూడా ఇచ్చే వాళ్ళు ఔషధం సేవించే టప్పుడు ఆ మంత్రాన్ని చదివి ఔషధం తీసుకోమని చెప్పే వాళ్ళు, 
తేలు మంత్రం..పాము మంత్రంతో ప్రాణాలు నిలుపుకున్న పల్లె ప్రజలు ఉన్నారు.. 
ఇప్పుడు అలాంటి కొన్ని మంత్రాల గురించి తెలుసుకుందాము...

1. నారాయణీయం
(ఇది గురువాయురు కృషుడి గురించి రాసిన వేయి పద్యాల అద్భుతమైన వర్ణన ) 
ఈ శ్లోకాలు జబ్బుతో ఉన్న వారు కానీ లేక వారి కోసం ఎవరు చదివినా భయంకరమైన  ప్రాణాపాయ జబ్బులు, కాన్సర్, దీర్ఘకాలిక రోగాలు నశించి పోతాయి.
ఒకసారి ఆ పుస్తకం తెచ్చుకుని ప్రయత్నం చేయండి, కృషుడి పైన పద్యాలు వాటి అర్థాలు ఎంతో భక్తి భావనతో భావోద్వేగాలు కలిగిస్తుంది... 
చక్కటి ఆరోగ్యం ఆలోచన కలిగిస్తుంది..

2. వైద్యనాద్ స్త్రోత్రం
శివయ్య గొప్ప వైద్యుడు కూడా   
పురాణకాలం నుండి వైద్యంకోసం శివుని ఆరాధించేవారు, చర్మ వ్యాధులు ఇన్ఫెక్షన్ తో బాధపడే వారు 
ప్రదోష కాలంలో ఈ వైద్యనాద్ స్త్రోత్రం, 
శివ స్త్రోత్రాలు పారాయణం ప్రతి రోజు చేయాలి, సోమవారంనాడు శివునికి వాయుప్రతిష్ఠ చేసిన లింగానికి వారి చేత్తో అబీషేకం చేయాలి, 
ఆరుద్ర నక్షత్రం రోజు ప్రదోష కాలంలో మట్టితో శివలింగాన్ని చేసుకుని, బియ్యం పిండి, గంధం, విభూది వీటితో 
ఒక్కో దానితో ఓం నమః శివాయ అని 108 సార్లు 
అర్చన చేసి, నైవేద్యం పెట్టి వైద్యనాద్ స్త్రోత్రం పఠించి  హారతి ఇవ్వాలి ,
కాసేపు  ధ్యానం చేసి ప్రసాదం భక్తిగా స్వీకరించాలి.. సంకల్పంతో మీకు ఆరోగ్యం ప్రసాదించమని వేడుకోవాలి, ప్రసాదం తినేటప్పుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుని తినాలి.. 
తర్వాత మీరు చేసిన మట్టి శివలింగాన్ని ప్రవహిస్తున్న నీటిలో కలపాలి 
చెరువు అయినా పర్వాలేదు... 
అలా నిమర్జన చేయడంలోనే మీకు మీ బాధ నుండి 
చాలా ఉపశమనం లభిస్తుంది.. 
ఇలా ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు చేస్తూ రావాలి 
మీకు పూర్తి ఆరోగ్యం లభించాక శివాలయంలో
అభిషేకం చేయించండి...

3.చిన్న చిన్నవి తరచూ వచ్చే జ్వరాలు , కీళ్ల నొప్పులు, ఊబకాయం , తిన్నది అరగక పోవడం, 
వంటికి పట్టకపోవడం, తరచు నీరసం లాంటి 
కారణం తెలియని రోగాలు మంచి ఉపాయం హనుమంతుడి గుడి సందర్శన, హనుమాన్ చాలీసా రోజు చదవడం..!

4. రాహుకాలం లో దుర్గ దేవి, సుబ్రహ్మణ్యస్వామి , కాలభైరవ స్వామి శ్లోకములు చదువుతూ ఉన్నా అకారణంగా వచ్చే భయాలు, నిద్రలో ఉలిక్కి పడటం, తరచు క్రిందపడటం ఇలాంటి బాధలు ఉండదు,.

5. ఏ ఔషధం సేవిస్తున్న కూడా
"ఓం నమో భగవతే వాసుదేవాయా " అని సేవిస్తే 
ఆ మందు మీకు బాగా పనిచేస్తుంది.!

6.మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఆలోచన వస్తుంది మంచి జీవితం ఉంటుంది.
ఎవరికి భారం కాకుండా ప్రాణం పోవాలి చివరి రోజుల్లో... అంటే రోజూ ఐదు తులసి ఆకులు తినండి, 
కాసేపు తులసికి దగ్గరగా కూర్చోండి.
తులసి మొక్క ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది, 
రేఖీ, విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే గుణం తులసికి ఉంది , ఇలాగే ఆవుకి కూడా.
అవకాశం ఉన్న వారు కాసేపు గోసాలలో గడపండి..
వైద్యం చేయించు కుంటూ ఇవి పాటిస్తే 
త్వరగా గుణం ఉంటుంది.
మానవ ప్రయత్నం మానకూడదు.
దైవ బలం వదులు కొకూడదు.

Tuesday, November 26, 2019

మార్గశిర మాస విశిష్టత


మాసానాం మార్గశీర్షోహం – అన్నారు జగద్గురువు *శ్రీకృష్ణ పరమాత్మ*. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, వంటివారితో పాటు స్వయం భగవానుముఖతః ప్రకటితమైన *శ్రీమద్భగవద్గీత* అవతరించిన మాసం. ఈ జగత్తులోని అన్ని విభూతులలోనూ తాను ప్రకటితమైనప్పటికీ, కొన్ని అగ్రగణ్యమైన విషయాలలో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పాడు. అలా మాసాలలో అగ్రగామి అయిన మార్గశీర్షం లేదా మార్గశిర మాసమే తన స్వరూపమనీ చెప్పాడు. మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి *ఉత్తరాయణం* ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. అలా చూసుకుంటే *దక్షిణాయనం* చివరిభాగం, *ఉత్తరాయణం* ముందు వచ్చే భాగం అయిన మార్గశిరం పగలుకు ముందు వచ్చే *బ్రాహ్మీముహూర్తం* వంటిది. *బ్రాహ్మీ ముహూర్తం* రోజులో ఎంత ప్రాధాన్యత కలిగినదో, సంవత్సరానికి స్వయం విష్ణుస్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది.

లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతీరోజూ శుభప్రదమైనదే. తొలిరోజు కార్తీకమాసమంతా వ్రతాలు చేసిన వారు పోలిని స్వర్గానికి పంపించుట అనగా నదీ స్నానం చేసి దీపాలు వదలుటతో ప్రారంభమవుతుంది. ఆనాడు నదీ స్నానం చాల పుణ్యప్రదం. కుదరనివారు గంగాది నదులను స్మరించుకొని స్నానం చేయడం ముఖ్యం. ప్రతీరోజూ శుభప్రదమైనదే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం.
మార్గశిర శుద్ధ తదియ నాడు *ఉమామహేశ్వర వ్రతం* చేసి శివపార్వతులను ఆరాధించడం కొన్ని ప్రాంతాలలో ఉంది.
అలాగే *మార్గశిర శుద్ధ పంచమి* నాడు *నాగపంచమి* చేసే ఆచారం కూడా ఉంది. కొన్ని ప్రాంతాలలో శ్రావణమాసంలో, మరి కొన్ని చోట్ల కార్తీక మాసంలో ఈ వ్రతం చేస్తారు.

మార్గశిర శుద్ధషష్ఠి *సుబ్రహ్మణ్యస్వామి జన్మదినం*. శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినం. ఈనాడు ఉపవాసం ఉండి, సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తారు. సంతానం కోరుకునే వారు స్వామిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది. దేశంలో గల పలు సుబ్రహ్మణ్య ఆలయాలలో విశేషమైన పూజలూ, ఉత్సవాలూ, నాగప్రతిష్టలూ జరుగుతాయి.

*మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం*. దీనినే *కాలభైరవాష్టమి* అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం కాలభైరవావతారం. కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉంది కాశీకి వచ్చిన, కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్కచూస్తుంటాడు. శునకం కాలభైరవస్వరూపం. ఈనాడు శునకాన్ని పూజించి, గారెలు వండి, దండగా గ్రుచ్చి, శునకం మెడలో వేస్తుంటారు.

*మార్గశిర శుద్ధేకాదశి *శ్రీమద్భగవద్గీత లోకానికి అందినరోజు. దీనినే వైకుంఠ ఏకాదశి లేదా *మోక్షద ఏకాదశి,* సౌఖ్యద ఏకాదశి అంటారు. సాక్షాత్ భగవత్స్వరూపాన్ని మానవులు తెలుసుకోగలిగే విధంగా, అంతేకాకుండా సులభమైన రీతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం ఇందులో భగవానుడు చెప్పాడు. అది ఎవరో ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే వాళ్ళకే కాకుండా, సంసార సముద్రంలో మునిగి తేలుతున్న ప్రతీ ఒక్కరికీ కర్మయోగం, భక్తియోగం, నిష్కామ కర్మలు ఎలా ఆచరించాలి, కర్తవ్యాన్ని విస్మరించకుండానే భగవంతుని చేరే మార్గం, స్వధర్మాచరణ యొక్క ఆవశ్యకత, పరధర్మానుష్టానం వల్ల కలిగే విపత్తులు వంటివెన్నో శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ తెలియచెప్పాడు. *భగవద్గీత నిత్యపారాయణ*, నిత్య ఆచరణా గ్రంథమైనప్పటికీ, విశేషించి ఈనాడు శ్రీకృష్ణుని తలచుకుని గీతాపారాయణ, గీతా అధ్యయనం, అనుష్టానం చేయాలి.

మార్గశిర శుద్ధ ద్వాదశిని *మత్స్య ద్వాదశి* అంటారు. దశావతారాలలో తోలి అవతారమైన మత్స్య అవతారాన్ని పూజిస్తారు.

మార్గశిర శుద్ధపూర్ణ *శ్రీ దత్తజయంతి*. దీనినే కోరలపూర్నిమ, *నరక పూర్ణిమ* అంటారు. ఈనాడు అగ్నిపురాణం దానం చేస్తే మంచిది. సాక్షాత్ త్రిమూర్తులలోని విష్ణువు యొక్క అంశగా అత్ర్యనసూయలకు జన్మిన దత్తాత్రేయుడు, మౌనముద్రతోనే ఉపదేశం చేసి, పరమగురువయ్యాడు. ప్రకృతిలోని 24 మంది గురువుల వద్ద విద్యనభ్యసించి ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయుడు. ఆత్మతత్త్వాన్ని లోకానికి ఎరుకపరచి గురువులకే గురువైన అవధూత. ఈనాడు దత్తచరిత్ర పారాయణ చేసి, ఆ పరమగురువుని స్మరించుకుంటారు.

మార్గాశిరమాసంలో వచ్చే లక్ష్మివారం(గురువారం) నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకలైశ్వర్యాలూ కలుగుతాయని నమ్మకం. ఆ రోజున స్త్రీలు నియమానుసారంగా లక్ష్మీదేవిని పూజించి, వ్రతంలో చెప్పిన విధంగా నైవేద్యం సమర్పించి, వ్రతకథను చదువుకొనాలి. అలా అ మాసంలో వచ్చే అన్ని లక్ష్మివారాలూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా లక్ష్మీదేవిని పూజించి, ఆనాడు తమ శక్త్యనుసారం ముత్తైదువలకి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ పువ్వులు, తాంబూలం మొదలగు మంగళద్రవ్యాలనివ్వాలి. ఇలా నియమం తప్పకుండా చేసేవారి ఇంట లక్ష్మీదేవి కొలువుంటుంది అని పురాణప్రోక్తం.

ఇంకా మార్గశిరమాసంలోనే విష్ణువుకి ప్రీతికరమైన *ధనుర్మాసం* వస్తుంది.

Sunday, November 17, 2019

శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రం

ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

గంగాధరం మహాదేవం సర్పాభరణ భూషితం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

అనాధ పరమానందం కైవల్యపద గామినం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

స్వర్గాపవర్గ దాతారం సృష్టి స్థితి వినాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఉత్పత్తి స్థితి సంహార కర్తారం గురుమీశ్వరం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తస్య మృత్యు భయం నాస్తి- నాగ్నిచోరభయం క్వచిత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శతావర్తం ప్రవర్తవ్యం సంకటే కష్ట నాశనం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధి ప్రదాయకం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

జన్మ మృత్యు జరారోగైః పీడితం కర్మ బంధనైః
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తావతస్త్వద్గత ప్రాణః త్వచ్చిత్తోహం సదామృడ 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యం మనుం జపేత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నమశ్శివాయ సాంబాయ హరయే పరమాత్మనే
ప్రణత క్లేశనాశాయ యోగినాం పతయే నమః ||

మృకండు సూను మార్కండేయ కృత
మృత్యుంజయ స్తోత్రం సంపూర్ణమ్.

Tuesday, November 5, 2019

మారేడు వృక్షం విశిష్టత

మారేడు వృక్షం విశిష్టత ఏంటి?

త్రినేత్రుడు, త్రిగుణాతీతుడు అయిన పరమేశ్వరుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. శివరాత్రి నాడు తెలిసో తెలియకో ఓ మారేడు దళాన్ని శివలింగం మీదకు విసిరేసినందుకే చాలామంది భక్తులకు ఆ జన్మలోని పాపాలన్నీ నశించి ఉత్తర జన్మలన్నీ ఉత్తమోత్తమ జన్మలుగా లభించాయి. మన పురాణాల్లో ఇలా కేవలం మారేడు దళాలను శివలింగానికి అర్పించి సులభంగా పుణ్యాన్ని సంపాదించిన భక్తుల సంఖ్య అధికంగానే కనిపిస్తుంది. శివాలయాలలో నిత్యం బిల్వార్చనలు (మారేడు దళాలతో అర్చనలు), పర్వ దినాలప్పుడు లక్ష బిల్వార్చనలు జరుపుతుంటారు. ఇలా చేయటమంతా మారేడు విశిష్టతకు ప్రతీకగా కనిపిస్తుంది. ‘మారేడు (మారాజు) నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు’ అని తెలుగు కవులు మారేడు పదాన్ని శ్లేషార్థంగా చెప్పిన సందర్భాలు సాహిత్యంలో చాలా చోట్ల ఉన్నాయి. ఇలాంటి మారేడు చెట్టు మహిమను గురించి శివ పురాణం విద్యేశ్వర సంహిత సాధ్యసాధన ఖండం ఇరవై రెండో అధ్యాయం ఇలా వివరిస్తోంది. ఈ వివరణలోనే శివభక్తులలో ఉన్న ప్రవృత్తి, నివృత్తిపరుల భక్తి విశేషాలు కూడా కనిపిస్తున్నాయి. కార్తీక మాసం నేపథ్యంలో శివుడికి అత్యంత ఇష్టమైన మారేడు విశిష్టత ఇదే!

మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం. ఆ చెట్టును దేవతలంతా స్తుతిస్తుంటారు. లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదులో ఉంటాయి. ఆ చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహాదేవుడైన శివుడిని పూజించటం ఎంతో పుణ్యప్రదం. ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వ తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాలలో పలుచోట్ల చెప్పటం కూడా ఉంది. ఆ చెట్టు కుదురు ఎంతో గొప్పది. అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. శివుడి అనుగ్రహం సంపాదించాలంటే మారేడు చెట్టు మొదలును నిత్యం నీటితో తడుపుతున్నా సరిపోతుంది. గంధ పుష్పాదులతో ఆ మూలాన్ని పూజించిన వారు శివలోకార్హతను పొందుతారు. ఆ భక్తుల ఇంట సంతానం, సుఖం వర్థిల్లుతూ ఉంటుంది. 

మారేడు వృక్షం విశిష్టత ఏంటి?

మారేడు చెట్టు మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపాలను పెట్టిన వారికి తత్వజ్ఞానం లభించి అంత్యంలో మహేశ్వరుడిలో ఐక్యమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది. కొత్త చిగుళ్ళతో ఉన్న మారేడు కొమ్మను తాకటం, ఆ చెట్టును పూజించటం లాంటివి పాప విముక్తికి దోహదకారులు. అలాంటి పవిత్రమైన వృక్షం కింద ఒక్క భక్తుడికి భోజనం పెట్టినా కోటిరెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఆ చెట్టు కింద పాలు, నెయ్యితో వండిన పరమాన్నాన్ని శివభక్తుడికి పెడితే అది మొదలు ఇంకా ఎప్పటికీ ఏ జన్మలోనూ అలా పరమాన్నం పెట్టిన వాడికి దరిద్రం అనేది ఉండదు. శివ నైవేద్యంగా లభించే ఈ మారేడు దళాన్ని పొందిన వాడు మహా పుణ్యాత్ముడవుతాడు. శివ ప్రసాదంలో పత్రం, పుష్పం, ఫలం, జలం లాంటివన్నీ సాలగ్రామ స్పర్శ, శివలింగ స్పర్శవల్ల అవి ఎంతో పవిత్రతను సంతరించుకుంటాయి. శివపూజ చేసే వారిలో ప్రధానంగా రెండు రకాల వారుంటారు. ఆ ఇద్దరికీ ఈ మారేడు దళాలు శివలింగమంత విలువైనవే. ప్రవృత్తి నివృత్తి అనే రెండు భక్తి మార్గాలలో భక్తులు శివపూజ చేస్తుంటారు. ప్రవృత్తి మార్గాన్ని అనుసరించే వారు శివలింగ పీఠాన్ని పూజిస్తారు. అలా చేయటం వల్ల వారికి సర్వ దేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది. అలాంటి భక్తులు అభిషేకం చేసి నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యం ఇస్తుంటారు. పూజ అయిన తర్వాత ఆ లింగాన్ని శుద్ధి చేసి సంపుటిలో పెట్టి పవిత్రమైన ప్రదేశంలో భద్రపరుస్తుంటారు. నివృత్తి మార్గాన్ని అనుసరించే భక్తులు చేతిలోనే శివలింగాన్ని ఉంచుకొని పూజించి భిక్షాటనతో లభించిన ఆహారాన్ని ఆ శివలింగానికి నైవేద్యం పెడతారు. 

ఓంకారాన్ని సూక్ష్మ లింగంగా భావించి ఉపాసించటం నివృత్తి పరులలో కనిపించే మరో ప్రత్యేకత. ఆ భక్తులు లింగాన్ని విభూతితో అర్చించటం, ఆ విభూతిని నైవేద్యంగా ఇవ్వటం కూడా ఉంది. అలాగే పూజ అయిన తర్వాత శివలింగాన్ని సర్వదా శిరస్సు మీదనే ధరిస్తూ ఉంటారు. ఇలా ఈ కథా సందర్భంలో మారేడు చెట్టు మహిమ గురించి శివభక్తులలోని ప్రవృత్తి, నివృత్తి అనే మార్గాలననుసరించే భక్తులను గురించి వివరించటం కనిపిస్తుంది. మారేడు వృక్షం ఇంత పవిత్రతను సంతరించుకొని ఉండటానికి ఆ చెట్టు దళాలు, బెరడు అన్నిటిలోనూ ఔషధీయ గుణాలు ఉన్నాయని ఆధునిక శాస్త్రవేత్తలు విశ్లేషించి చెబుతున్నారు

Friday, November 1, 2019

భగవంతునికి ప్రతిరూపం రుద్రాక్షలు (చింతా గోపి శర్మ సిద్ధాంతి భువనేశ్వరి పీఠం వారి వాట్సప్ పోస్ట్ నుండి)

ఆధ్యాత్మికతతో నిండిపోయుండే భారతీయ హృదయానికీ, రుద్రాక్షకూ అవినాభావ సంబంధం ఉంది. శివుని అక్షుల నుంచి జాలువారిన నీటి బిందువులు భూమి మీదకు జారి మొక్కలుగా మొలిచి వృక్షాలుగా మారి వాటికి కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. 

ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు.. అందరూ వీటిని ధరించారని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ గురువులు, స్వామిజీలు, బ్రాహ్మణులూ, పూజారులు, దైవజ్ఞులు.. వంటి వారు వీటిని ధరిస్తూ ఉంటారు. అంతేకాదు పూజా గదులలో కూడా వీటిని పెట్టి పూజిస్తూ ఉన్నారు.

రుద్రాక్షలు అత్యంత శక్తివంతమైనవనీ, వీటిని ధరిస్తే ఎటువంటి చెడు ప్రభావం తమపై పడదనే భావన ఉంది. చాలా అరుదుగా లభించే రుద్రాక్షలంటే ఎవరైనా ఆరాటపడుతూనే ఉంటారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు పడుతున్నవారు, వ్యాపారపరంగా కలసిరానివాళ్ళు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారే కాక అద్భుత భవిష్యత్తును ఆశించేవారు కూడా ముందు చూపుగా ఈ రుద్రాక్షలను ధరిస్తుంటారు.

భక్తులను అనుగ్రహించేందుకు రుద్రాక్షలు స్థావరాలుగా అవతరించాయి. వీటిని ధరించిన భక్తులు ఏ రోజు చేసిన పాపాలు ఆ రోజే నశిస్తాయని.. రుద్రాక్షలను దర్శించడం వల్ల లక్ష జన్మల పుణ్యం, ధరించడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందని 'జాబాలోపనిషత్' చెబుతోంది. రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలగిపోతాయని.. సకల సంపదలూ ఒనగూడుతాయని స్కాంద పురాణం చెబుతోంది.

రుద్రాక్షకు ఆ నామం ఎలా వచ్చింది?
రుద్రుడు అంటే శివుడు, రాక్షసులతో పోరాడి, 3 పురములను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినపుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. వాటి నుంచి జన్మించినవే రుద్రాక్షలు. రుద్రాక్ష అనగా రుద్రుడి కళ్ళు, కన్నీళ్ళు అని అర్ధం. శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చెబుతారు. 

ఇక రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత శక్తివంతమైనవని తంత్ర శాస్త్రం చెబుతోంది. అంటే ఉసిరిక కాయంత పరిమాణమున్నవి ఉత్తమమైనవిగా, రేగుపండంత పరిమాణమున్నవి మధ్యమ జాతికి చెందినవిగా, శనగ గింజ పరిమాణం ఉన్నవి అధమమైనవిగా చెప్పబడుతున్నాయి. కాబట్టి రుద్రాక్షలను ధరించే సమయంలో వాటి పరిమాణం కూడా ముఖ్యమే. 

రుద్రాక్షలు రకరకాల పరిమాణాల్లో ఉన్నట్లే రకరకలైన రంగుల్లో కూడా ఉంటాయి. ప్రధానంగా తెలుపు, తేనె, నలుపు రంగులతోపాటు మిశ్రమ రంగుల్లో ఇవి లభ్యమవుతాయి. సాధారణంగా తేనె రంగులోని రుద్రాక్షలు ఎక్కువగా లభిస్తాయి.

రుద్రాక్షలలో వివిధ ముఖాలు కలిగినవి లభ్యమవుతాయి. ముఖ్యంగా 38 రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నప్పటికీ, పండితులు మాత్రం 21 ముఖాలు వున్న రుద్రాక్షలు మాత్రమే ఉన్నట్లు చెబుతారు. మొత్తం మీద పరిశీలిస్తే 14 ముఖాలున్న రుద్రాక్షలు మత్రమే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంది. 

వాటి వివరాలు, ఉపయోగాలు ఏంటో చూద్దాం

1. ఏకముఖి రుద్రాక్ష
ఏకముఖి రుద్రాక్ష శివుని ప్రతిరూపం. శివుని త్రినేత్రముగా, ఓంకార రూపంగా నమ్ముతారు. ఇది ధరించిన వ్యక్తికి వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరతాయి.

2. ద్విముఖి
ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీస్వర తత్వానికి సంకేతం. శివపార్వతి రూపంగా నమ్ముతారు. దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి పెరుగుతుంది.

3. త్రిముఖి
త్రిముఖి రుద్రాక్షను త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు. ఇది అగ్నికి సంకేతం. ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది.

4. చతుర్ముఖి
చతుర్ముఖి రుద్రాక్ష నాలుగు వేదాల స్వరూపం. ఇది బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పాలలో వేసి తాగితే మానసిక వ్యాధులు దూరమవుతాయి. విద్యార్ధులకు మరింతా ఉపయోగం.

5. పంచముఖి 
పంచముఖి రుద్రాక్ష పంచభూత స్వరూపం. గుండె జబ్బులు ఉన్నవారికి ఇది మంచిది. ఇది పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది. అంతేకాదు శతృవులను సులభంగా జయించవచ్చు. 

6. షణ్ముఖి 
షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా వంటి వ్యాధులు దూరమవుతాయి.

7. సప్తముఖి 
సప్తముఖి రుద్రాక్ష కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని విశ్వాసం.

8. అష్టముఖి 
అష్టముఖి రుద్రాక్ష వినాయకుడికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.

9. నవముఖి 
నవముఖి రుద్రాక్ష నవగ్రహ స్వరూపము. ఇది భైరవునికి ప్రతీక. దీనిని ఎడమ చేతికి ధరించాలి. దుర్గ ఆరాధకులకు మంచిది. 

10. దశముఖి
దశముఖి రుద్రాక్ష దశావతార స్వరూపము. ఇది జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగము చేసినంత ఫలితము కలుగుతుంది. దీనిని మహిళలు ఎక్కువగా ధరిస్తారు.

11. ఏకాదశముఖి 
ఏకాదశముఖి రుద్రాక్ష 11 ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది.

12. ద్వాదశముఖి 
ద్వాదశముఖి రుద్రాక్ష 12 మంది ఆద్యులకు ప్రతీక. గౌరవం పెరుగుతుంది.

13. త్రయోదశముఖి  
త్రయోదశముఖి రుద్రాక్ష కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక. పాలలో వేసి, ఆ పాలను తాగితే అందం పెరుగుతుంది.

14. చతుర్దశముఖి 
చతుర్దశముఖి రుద్రాక్ష 14 ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమ శివుని కన్ను.

15. పంచదశముఖి 
పంచదశముఖి రుద్రాక్ష పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది.

16. షోడశముఖి 
షోడశముఖి రుద్రాక్ష 16 ముఖాలు కలది. ఇది కల్పిమాడుకుకు ప్రతీక.

17. సప్తదశముఖి 
సప్తదశముఖి రుద్రాక్ష విశ్వకర్మకు ప్రతీక. దీని వల్ల ఆర్థిక సంపద కలుగుతుంది.

18. అష్టాదశముఖి 
అష్టాదశముఖి రుద్రాక్ష 18 ముఖాలు. ఇది భూమికి తార్కాణం.

19. ఏకోన్నవింశతిముఖి 
ఏకోన్నవింశతిముఖి రుద్రాక్ష 19 ముఖాలు. ఇది సాక్షాత్తూ నారాయణుడికి సంకేతం.

20. వింశతిముఖి 
వింశతిముఖి రుద్రాక్ష 20 ముఖాలు. ఇది సృష్టికర్త బ్రహ్మకు సంకేతం.

21. ఏకవింశతిముఖి 
ఏకవింశతిముఖి 21 ముఖాలుగల రుద్రాక్ష. ఇది కుబేరునికి ప్రతీక. ఇది అత్యంత అరుదైన రుద్రాక్ష. 21 ముఖాల కలిగిన రుద్రాక్షలతో తయారైన మాలను ఇంద్ర మాల అంటారు. ఇంద్రమాలను ధరిస్తే ఇక వారికి దుస్సాధ్యమేదీ లేదు. అంతేకాదు జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరుతాయి.

రుద్రాక్షలను ధరించిన వారు పాటించవలసిన నియమాలు

రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు.
రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.
స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.
కుటుంబసభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు.
రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు.
రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.
రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.

ఎప్పుడు ఎలా ధరించాలి..? 
సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభ సమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి.
పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం శుభకరం. వీటిని బంగారం, వెండి, రాగి తీగెలతోగానీ, సిల్కు దారముతో గూర్చి గానీ ధరించాలి.  

రుద్రాక్షను ధరించేముందు "ఓం నమశ్శివాయ" శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. సంవత్సరానికి ఒక్కసారైనా మాలకు 'మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం' చేయడం శుభకరం. వీలైనంత వరకు శివరాత్రి చేయడం మంచిది. 

రుద్రాక్షలు ధరించిన వారు ధూమపానం, మద్యపానం చేయరాదు. వెల్లుల్లి, మాంసాహారమును మానివేయడం మంచిది. సరైన ఆకృతి లేని రుద్రాక్షలను, ముల్లు లేని రుద్రాక్షలను, పురుగులు తిన్న, పాడైపోయిన రుద్రాక్షలను ధరించరాదు. రుద్రాక్షలను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. 

జన్మనక్షత్ర రీత్యా  ధరించవలసిన రుద్రాక్షలు 

నక్షత్రము         ధరించవలసిన రుద్రాక్ష

అశ్వని              నవముఖి
భరణి               షణ్ముఖి
కృత్తిక               ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి              ద్విముఖి
మృగశిర           త్రిముఖి
ఆరుద్ర              అష్టముఖి
పునర్వసు         పంచముఖి
పుష్యమి           సప్తముఖి
ఆశ్లేష               చతుర్ముఖి
మఖ                నవముఖి
పుబ్బ              షణ్ముఖి
ఉత్తర               ఏకముఖి, ద్వాదశముఖి
హస్త                ద్విముఖి
చిత్త                 త్రిముఖి
స్వాతి              అష్టముఖి
విశాఖ              పంచముఖి
అనురాధ          సప్తముఖి
జ్యేష్ఠ                చతుర్ముఖి
మూల              నవముఖి
పూర్వాషాఢ        షణ్ముఖి
ఉత్తరాషాఢ         ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం             ద్విముఖి
ధనిష్ట               త్రిముఖి
శతభిషం            అష్టముఖి
పూర్వాభాద్ర        పంచముఖి
ఉత్తరాభాద్ర          సప్తముఖి
రేవతి                 చతుర్ముఖి                                .

Wednesday, October 30, 2019

కార్తీక మాసం లో దీపారాధన చేసేటప్పుడు మరియు దీపదానం చేసేటప్పుడు చదువవలసిన శ్లోకం


‘కార్తిక’ మాసం సంవత్సరంలోని సర్వమాసాలకంటే మహిమాన్వితమైనది.కార్తీక మాసం నెలరోజులూ రోజూ సాయం సంధ్య వేళ పూజా స్థలములో, తులసి కోటవద్ద, ఇంటిముందు దీపాలను వెలిగించి నమస్కరించే ఆచారం మన హిందువులకు అనాదిగా వస్తున్నది. రోజూ కుదరకపోయినా కార్తీక పూర్ణిమ నాడు తప్పక వెలిగిస్తారు.అలా వెలిగించిన దీపంలో దామోదరుని ఆవాహన చేసి, ఈక్రింది శ్లోకాన్ని చెప్పి ప్రార్థన చేయాలి.

 *కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః* 
 *జలేస్థలే… ఫలే ఏ నివసంతి* 
 *జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ* *భాగినః* 
 *భవతింత్వ స్వపచాహి విప్రాః* 

చీమలు, ఈగలు, దోమలు, పురుగులు, వృక్షాలు, జలచరాలు, భూచరాలు ఒకటేమిటి ఈ భూమిమీద నివసించే ప్రతీ ఒక్కజీవికీ కూడా ఈదీపం వెలుతురుని దర్శించ గానే ఇక మరుజన్మ అంటూ లేని అనంత పుణ్యాన్ని పొందాలి.

కార్తీక మాసమంతా స్నానం, దానం ఉపవాసం చేసే శక్తిలేని వారు కనీసం ఒక్క కార్తీక పౌర్ణమి నాడైనా వీటిని ఆచరిస్తే కార్తీక పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రోక్తి.ఈ మాసంలో ఉపవాసం పాటించేవారు ఏక భుక్తం, నక్తభోజనం చేస్తారు. నక్తం ఉండలేనివారు ఒక కార్తీక పౌర్ణమినాడు లేదా యేయైనా కార్తీక సోమవారాలు నక్తములున్నా పుణ్య ప్రదమే.కార్తీకపౌర్ణమి నాడు సత్‌ బ్రాహ్మణుని ఆహ్వానించి భోజనం పెట్టి దీప దానం చేస్తూ

” *సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపచ్చుభావహం!* 
 *దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ”* 

అనే శ్లోకం పఠించాలి.

‘దీపం జ్యోతి పరబ్రహ్మ:” దీపం జ్ఞానానికి ప్రతీక. ఈ దీపదానం వలన జ్ఞానం, ఆయు:వృద్ధి, విద్య, సకల భోగాలు కలుగుతాయని శాస్త్రం. 

కార్తీక మాసంలో ఉసిరికి అంత ప్రాధాన్యం ఎందుకు



కార్తీక మాసం అనగానే దీపారాధన, తులసి పూజ, వనభోజనాలు, కార్తీక స్నానం… వంటి నియమాలెన్నో గుర్తుకువస్తాయి. కానీ మన పెద్దలు ఈ నియమాలన్నింటికీ ఉసిరిని కూడా జోడించారు. ఉసిరి కాయ మీద వత్తిని వెలిగించడం, క్షీరాబ్ది ద్వాదశినాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడం, ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేయడం, వీలైతే ఉసిరి నీడ పడుతున్న నీటిలో స్నానం చేయడం వంటి ఆచరణలు మంచివని సూచించారు. మన ఆరోగ్యానికీ, పర్యావరణానికి మేలు చేసే వృక్షాలను దేవతా మూర్తులుగా భావించి కొలవడం మన ఆచారాలలోని గొప్ప విషయం. అందుకనే అత్యంత విశిష్టమైన తులసితో పాటుగా ఉసిరికి కూడా కార్తీక మాసంలో ప్రాధాన్యత ఇచ్చారు.
క్షీరసాగరమథనం తరువాత అమృతం కోసం దేవదానవుల మధ్య జరిగిన పెనుగులాటలో కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయనీ, అదే ఉసిరి చెట్టుగా మారిందినీ ఓ నమ్మకం. సకల వ్యాధులనూ నివారించి దీర్ఘాయువుని ప్రసాదించే అమృతంతో ఉసిరిని పోల్చడం సహేతుకంగానే తోస్తుంది. ఇక ఉసిరికి ఆయుర్వేదంలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు! ఆయుర్వేదంలో ఆరు రుచులన పేర్కొంటారు అవి… మధురం (తీపి), ఆమ్లం (పులుపు), కషాయం (వగరు), లవణం (ఉప్పదనం), కటువు (కారం), తిక్తం (చేదు). ఏ ఆహారపదార్థలోనైనా వీటిలో రెండో, మూడో, నాలుగో రుచులు కనిపిస్తే గొప్ప కానీ ఉసిరిలోని అద్బుతం ఏమిటంటే ఉప్పదనం తప్ప మిగతా అయిదు రుచులూ కనిపిస్తాయి. ముఖ్యంగా ఆమ్ల గుణం కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆమలకము లేదా ఆమ్లా అని పిలుచుకోవడం కద్దు. పైగా ఉసిరిలో తక్కువైన ఆ ఒకే ఒక్క లవణాన్ని కూడా చేర్చి అన్నంలో కలుపుకుని తినడం ద్వారా సంపూర్ణమైన ఆహారాన్ని స్వీకరించేవారు మన పెద్దలు.
ఇక కార్తీక మాసంలోనే ఉసిరికి ఎందుకంత ప్రాధాన్యత అన్నదానికి కూడా బోలెడు కారణాలు కనిపిస్తాయి. చలి విజృంభించే కార్తీక మాసాన కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ పరిహరింపబడతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదే! ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మకం. ఉసిరిలోని విటమిన్‌ సి ఈ మాసంలో వచ్చే కఫ సంబంధమైన జబ్బులను నివారిస్తే, అందులోని పీచు, ఆమ్ల గుణాలు జీర్ణ సంబంధ సమస్యలను తీరుస్తాయి.
అందుకే కార్తీక మాసం యావత్తూ ఉసిరికి సంబంధించిన నియమాలు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశినాడు ధాత్రి సహిత లక్ష్మీనారాయణస్వామినే నమః అంటూ విష్ణుమూర్తిని కొలుచుకుంటారు (ధాత్రి అంటే ఉసిరి). ఉసిరిని సాక్షాత్తూ విష్ణుస్వరూపంగా కొలుచుకుంటారు హైందవులు. అలాంటి ఉసిరి కాయలు, కొమ్మలు, చెట్టు సమీపంలో ఉండేలా అనేక నియమాలను ఆచరిస్తారు. ఉసిరిని సేవిస్తారు. అప్పటి వరకూ కురిసిన వర్షాలతో బలాన్ని పుంజుకున్న ఉసరి కూడా ఈ సమయంలో చక్కటి కాయలతో, పచ్చటి కాండంతో శక్తిమంతంగా ఉండి సకల ఆరోగ్యాలనూ ప్రసాదించేందుకు సిద్ధంగా ఉంటుంది.

Monday, October 28, 2019

కార్తీకమాసం

మాసాలల్లో కార్తీకమాసం పరమ పవిత్రమైనది. ఈ నెలలో స్నానం, దీపారాధన, ఉపవాసం, అభిషేకం, వనభోజనాలు ఈ నెలకు ప్రత్యేక మైన అంశాలు. 

*కార్తీకస్నానం:*
 ఏ మాసానికి లేని ప్రత్యేకమైన ఆచారం తెల్లవారు ఝామున చల్లనీటి స్నానం. దీనివెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. శరత్‌రుతువులో చివరి భాగంలో వచ్చే కార్తీకంలో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. వర్ష రుతుప్రభావం కనుమరుగై శీతాకాలానికి మధ్య సంధికాలంగా ఉండే సమయం ఇది. ఈ కాలంలో మారిన, మారుతున్న వాతావారణ పరిస్థితులకు అనుగుణంగా శరీరాన్ని మలచడం కోసం పూర్వీకులు ఏర్పాటుచేసిన ఆచారం కార్తీకస్నానం. నదుల్లో, సరస్సులు, పారే కాలువలు, జలపాతాలు, బావుల వద్ద స్నానం ఆచరిస్తే చాలా మంచిది. ఇది వీలుకాకపోతే ఇంట్లోనైనా శాస్త్ర ప్రకారం స్నానం ఆచరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

*స్నానం ఎలా ఆచరించాలి:*

 చల్లటి నీటితో స్నానం చేయాలి. వృద్ధులు, ఆనారోగ్యంతో వున్నవారికి ఈ విషయంలో సడలింపు ఉంది. మొదట మామూలుగా స్నానం ఆచరించి, తర్వాత పొడి వస్త్రం ధరించి సంకల్పం చెప్పుకొని రెండోసారి స్నానం ఆచరించాలి. శ్లోకం రానివారు, చదవలేనివారు భగవన్నామ స్మరణతో స్నానమాచరించాలి.

*చదవాల్సిన శ్లోకం:*

 తులారాశి గతే సూర్యే గంగా త్రైలోక్యపావని
సర్వత్రా ద్రవరూపేణ సాసంసారే భవేత్ తథా

ఈ అవకాశం లేనివారు అంటే వృద్ధులు, ఆనారోగ్యంతో బాధపడుతున్నవారు కనీసం శుద్ధపాడ్యమి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో పైన చెప్పిన సమయాల్లో స్నానం ఆచరిస్తే 30 రోజులు స్నానం ఆచరించిన ఫలితం లభిస్తుంది.
ఉద్యోగ కారణాలతో అవకాశం లేనివారు- కనీసం కార్తీక మాసంలో వచ్చే నాలుగు ఆదివారాలు  స్నానం ఆచరించి దేవాలయ సందర్శన చేసినా 30 రోజులు స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.

కార్తికమాసం విశిష్టత

కార్తికమాసం విశిష్టత ఇదే!

కార్తికమాసం విశిష్టత ఇదే!

ఆస్తిక లోకంలో కార్తిక మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నెలలో చేసే వ్రతాల వల్ల పుణ్య సముపార్జన సులభతరం అవుతుందని కార్తిక పురాణంతో పాటు మరికొన్ని వ్రత గ్రంథాలు వివరిస్తున్నాయి. శరదృతువు ఉత్తరార్ధంలో వచ్చే కార్తికమాసంలో ప్రతిరోజూ ఓ పర్వదినమే. ఈ కార్తికమాసంతో సమానమైన మాసం లేదని అత్రి మహర్షి అగస్త్యుడికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. నెల రోజులపాటు కార్తిక పురాణాన్ని రోజుకొక అధ్యాయం వంతున చదవటం, వినటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు. ఈ పురాణ క్రమాన్ని పరిశీలిస్తే తొలిగా వశిష్ట మహర్షి జనక మహారాజుకు కార్తికమాస వైభవాన్ని వివరించిన తీరు కనిపిస్తుంది. నైమిశారణ్యంలో సత్రయాగ దీక్షలో ఉన్న శౌనకాది మునులకు వశిష్టుడు జనకుడికి చెప్పిన విశేషాలనే సూతుడు మరింత వివరంగా చెప్పడాన్ని బట్టి కూడా ఈ మాసం గొప్పతనం విశిదమవుతుంది.

పవిత్ర స్నానాలకు ప్రత్యేకత అదే!
కార్తికమాసంలో నదీస్నానం, ఉపవాసం, పురాణ పఠన శ్రవణాలు, దీపారాధన, దీప దానం, సాలగ్రామ పూజ, దైవపూజ, వన సమారాధన లాంటివన్నీ జరపాలి. విష్ణువు ఆషాఢ శుక్ల దశమినాడు పాలకడలిలో శేషతల్పం మీద యోగనిద్రలోకి వెళ్లి తిరిగి కార్తిక శుక్ల ద్వాదశినాడు నిద్ర నుంచి లేస్తాడంటారు. అందుకే ఈ మాసానికి మరింత ప్రాముఖ్యాన్నిస్తారు భక్తులు. ఈ మాసంలో చెరువులు, బావులు, దిగుడు బావులు, పిల్ల కాలువలు అన్నింటా శ్రీ మహావిష్ణువు నివసిస్తాడంటారు. ఈ కారణంగానే పవిత్ర స్నానాలకు ఈ మాసంలో ఓ ప్రత్యేక స్థానముంది. కార్తికంలో శివాలయంలోనైనా, వైష్ణవాలయంలోనైనా సంధ్యా సమయంలో దీపం పెట్టి స్వామిని పూజిస్తే మేలు జరుగుతుందంటారు. కార్తిక మాస వ్రతాన్ని ఆచరిస్తే పాపనాశనం, మోక్ష ప్రాప్తి లభిస్తుందంటారు. ఈ మాసంలో వచ్చే సోమవారానికి మరింత విశిష్టత ఉంది. ఆ రోజున చేసే స్నాన, దాన, జపాదులు అధిక ఫలితాన్నిస్తాయి. ఆలయాలలో చేసే దీపమాలిక సమర్పణం కూడా సర్వపాప హరణం అని చెబుతారు. 

కార్తికమాసం విశిష్టత ఇదే!
 

అభిషేకంతో పాటు...
ఈ మాసంలో తులసి దళాలు, గంధంతో సాలగ్రామాన్ని అర్చించటం క్షేమదాయకం. సాలగ్రామాన్ని ఉసిరిచెట్టు కింద కూడా పూజించటం శ్రేయస్కరం. కార్తికంలో శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలతో పాటుగా తులసి, జాజి, మారేడు, అవిశెపూలు, మల్లె, గరిక తదితరాలతోపాటు గంధ పుష్ప ధూప దీపాలతో అర్చన చేస్తారు. వన సమారాధన చేసేటప్పుడు ఉసిరి చెట్టును పూజించటం వల్ల యముడి బారి నుంచి బయట పడవచ్చంటారు. ఈ మాసంలో చేసే హిరణ్య, రజత, తామ్ర, కాంస్య, ఉసిరి, దీప, లింగ, ధాన్య, ఫల, ధన, గృహ దానాలు మామూలు సమయాలకన్నా అధిక ఫలితాన్నిస్తాయి. కార్తికమాసంలో తొలి రోజు నుంచి చివరి రోజు దాకా ఏ రోజున ఏ వ్రతం చేయాలో, ఎలాంటి నియమాలను పాటించాలో కార్తిక పురాణం వివరిస్తోంది. ఈ పురాణంలో ఉన్న అనేకానేక కథలు పురాణ మహాత్మ్యాన్ని వివరిస్తున్నాయి. 

కార్తికమాసం విశిష్టత ఇదే!

కార్తికమాసం ఉపవాసం విధానం ఇది
మిత్రవర్మ, తత్వనిష్ఠుడు, సత్రాజిత్తు, దేవశర్మ కుమారుడు (మూషికం), ద్రావిడ దేశపు స్త్రీ, అజామిళుడు, మందరుడు, ధర్మవీరుడు, సువీరుడు, పురంజయుడు, అంబరీషుడు లాంటి అనేకానేకుల ద్వారా ధర్మ మార్గ వర్తనం వివరించటం కనిపిస్తుంది. కార్తిక మాసం నెలరోజులు చేయాల్సిన విధులను, వ్రతాలను కార్తిక పురాణం పేర్కొంటోంది. ఒకటో రోజున అర్చన, అగ్ని పూజ నిర్వహించాలి. సాయంత్రంపూట విధిగా ఆలయంలో దీపం పెట్టి దేవుడికి నైవేద్యాలను సమర్పించి స్తుతించాలి. ఇలా కార్తికమాసం మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా చెయ్యాలి. కార్తిక పురాణంలో రెండో అధ్యాయంలో వశిష్టుడు కార్తిక సోమవారం వ్రతాన్ని గురించి చెప్పాడు. సోమవారం వ్రతం మొత్తం ఆరు విధాలుగా చేసుకోవచ్చని వివరించాడు. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం, స్నానం, తిలాదానం అనే ఆరు రకాలుగా సోమవార వ్రతం ఉంటుంది. కార్తిక సోమవారంనాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసి తీర్థాన్ని మాత్రమే సేవించటం ఉపవాసంగా చెబుతారు. అలా చేయటం సాధ్యం కానివాళ్లు ఉదయం పూట యథాప్రకారం స్నాన, దాన, జపాలను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రం శివ తీర్థాన్నో, తులసి తీర్థాన్నో ఏదో ఒకటి మాత్రం స్వీకరిస్తారు. ఇలా చేయటాన్ని ఏకభుక్తం అని అంటారు. పగలంతా ఉపవాసంతో గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తరువాత భోజనం చేయటాన్ని నక్తం అని అంటారు. తమకు తాము భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినవచ్చు. దీన్నే అయాచితం అని పిలుస్తారు. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం అనే నాల్గింటిలో ఏదీ చెయ్యలేని వారు కార్తిక సోమవారం నువ్వులు దానం చేసినా సరిపోతుంది. దీన్నే తిలాదానం అంటారు. ఈ ఆరు విధానాల్లో కనీసం ఏదో ఒకటైనా ఆచరించి తీరటం శ్రేయస్కరమని శివపురాణం చెబుతోంది. 

కార్తికమాసం విశిష్టత ఇదే!

సోమవారం వ్రత ఫలితం...
సోమవార వ్రతాన్ని ఆచరించే వాళ్లు నమక, చమక సహితంగా శివాభిషేకం చెయ్యాలి. సోమవార వ్రత ప్రభావాన్ని వశిష్ట మహర్షి నిస్టురి అనే ఒక స్త్రీ కథతో ముడిపెట్టి చెప్పాడు. నిష్టురి గారాబంగా పెరిగి తప్పుదోవ లెన్నెన్నో తొక్కి వివాహమయ్యాక భర్తను కూడా మోసగించి చివరకు కాలక్రమంలో మరణిస్తుంది. మరుసటి జన్మలో ఓ శునకంగా జన్మించిన ఆమె ఒక వేద పండితుడు కార్తికమాసంలో తన ఇంటి బయట ఉంచిన బలి అన్నాన్ని భుజించి పూర్వజన్మ స్మృతి పొందింది. ఆ వెంటనే తనను రక్షించమంటూ మానవ భాషలో మాట్లాడటంతో ఆ వేదపండితుడు ఇంటి బయటకు వచ్చి శునకం పూర్వజన్మ వృత్తాంతాన్ని తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకుంటాడు. తాను కార్తిక సోమవార వ్రతాన్ని అవలంబించి బయట విడిచిపెట్టిన బలి అన్నాన్ని తిన్నందువల్లనే కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగిందని గ్రహిస్తాడు. వెంటనే స్పందించి తాను చేసిన అనేకానేక కార్తిక సోమవార వ్రతాలలో ఒక సోమవారంనాటి ప్రతిఫలాన్ని ఆ కుక్కకు ధారపోస్తాడు. క్షణాలలో ఒక దివ్య స్త్రీగా కుక్క దేహాన్ని విడిచిపెట్టి కైలాసానికి చేరుతుంది. వశిష్టుడు ఇలా కార్తిక సోమవార వ్రత మహాత్మ్యాన్ని జనకుడికి వివరించాడు.

Saturday, October 26, 2019

దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీ స్తోత్రం


నమశ్రియై లోకధాత్ర్వై బ్రహ్మామాత్రే నమోనమః 
నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమోనమః !!

ప్రసన్న ముఖ పద్మాయై పద్మ కాంత్యై నమోనమః 
నమో బిల్వ వన స్థాయై విష్ణు పత్న్యై నమోనమః 

విచిత్ర క్షామ ధారిణ్యై పృథు శ్రోణ్యై నమోనమః 
పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమోనమః !!

సురక్త పద్మ పత్రాభ కరపాదతలే శుభే 
సరత్నాంగదకేయూర కాంచీనూ పురశోభితే !!

యక్షకర్ధమ సంలిప్త సర్వాంగే కటకోజ్జ్వలే 
మాంగళ్యా భరణైశ్చిత్రైః ముక్తాహారై ర్విభూషితే !!

తాటంకై రవతం సైశ్చ శోభమాన ముఖాంబుజే 
పద్మ హస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే !!

ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమోనమః 
ప్రసీదాస్మాన్ కృపాదృష్టి పాతై రాలోక యాబ్దిజే 
యేదృష్టాతే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః

ఫలశ్రుతి 
ఇతిస్తుతాతథాదేవైః విష్ణు వక్షస్స్థలాలయా 
విష్ణునా సహసందృశ్య రమాప్రేతావదత్సురాన్ 
సురారీన్ సహసాహత్వా స్వపధాని గమిష్యథ 
యే స్థానహీనాః స్వస్థానా ద్ర్భ్రం శితాయేనరాభువి 
తేమామనే నస్తోత్రేణ స్తుత్వా స్థానమవాప్నుయుః !!

Thursday, September 26, 2019

శరన్నవరాత్రి వేడుకలు (సేకరణ-ఈనాడు పేపర్ నుండి)




అమ్మంటే..ప్రేమ, ఆప్యాయత , అనురాగం, మమకారం. 

అమ్మంటే..మార్గదర్శి, కార్యదక్షురాలు, శిక్షకురాలు.

అమ్మంటే... మందలింపు, అదిలింపు, దారితప్పిన వారికి బెదిరింపు.

జగత్తంతటికీ తల్లి అయిన జగదాంబ తత్త్వం ఇదే. మనలో నిలిచి ఉండి, నడిపించేది ఆ అమ్మే. పరతత్త్వానికి ప్రతీకగా నిలిచే అపరాజిత పూజకు సమయం ఆసన్నమైంది. ఆమెను తెలుసుకుందాం... మనసారా కొలుచుకుందాం...

దేవీ భాగవతంలో జగన్మాత తన గురించి బ్రహ్మకు స్వయంగా చెబుతూ... ఈ సృష్టిలో నేను కానిది ఏదీలేదని వివరిస్తుంది. ‘బుద్ధి, శ్రీ, కీర్తి, స్మృతి, శ్రద్ధ, మేధ, దయ, లజ్జ, ఆకలి, కోరిక, ఓర్పు, కాంతి, శాంతి, దప్పిక, నిద్ర, మెలకువ, జర, యవ్వనం, విద్య, స్పృహ, వాంఛ, శక్తి, వస, వాక్కు, మజ్జ, వృష్టి, చర్మం, రుతం, అనృతం.... ఇలా అన్నీ నేనే’ అంటుంది. సర్వ దేవతా రూపంనాదే. శక్తిని, పరాక్రమాన్ని నేనే అని చెబుతుందామె. సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ , విష్ణు, మహేశ్వరులు సైతం ఆ పరాశక్తికి లోబడి ఉన్నవారే. సృజన, పాలన, సంహారకాలనే మూడు శక్తులున్న ఆమె త్రిశక్తి స్వరూపిణి. వాటిలో బ్రహ్మకు సృజన శక్తిని, విష్ణువుకు పాలనా శక్తిని, శివుడికి సంహార శక్తిని ప్రసాదించి బ్రాహ్మి (సరస్వతి), వైష్ణవి(లక్ష్మి), శివాని (పార్వతి) రూపాల్లో వారి వెన్నంటి ఉండి లోకరక్షణ చేయిస్తోంది సాక్షాత్తు భగవతే అని దేవీ భాగవతం వివరిస్తోంది.

విశ్వమంతా వ్యాపించిన ఉన్న శక్తి ఒక్కటే. ఏకరూపంలోని ఈ శక్తి వివిధ అవతారాలను ధరించిందని ‘శ్వేతాస్వతారోపనిషత్తు’ చెబుతోంది. అన్నీ, అంతా తానైన దేవి ఎన్ని రూపాలు ధరించినా మూలశక్తి మాత్రం ఒకటే. ఈ విషయాన్ని నిరూపించేదే నవ శబ్దం. తొమ్మిది గుణిజాలు ఎన్నో ఉన్నా, అవి ఎంత పెద్దవి అయినా అన్నీ కలిపితే చివరికి మిగిలేది తొమ్మిదే. జగత్కారిణి అయిన దేవి ఎన్ని రూపాలు ధరించినా ఆమె తత్త్వం ఏకత్వం. భిన్న రూపాల్లో, శక్తుల్లో ఉన్న పరతత్త్వం ఆమే. ఇదే నవరాత్రి అంతరార్థం.

ప్రతి జీవిలోని చైతన్యం ఆమే. అలా అయినప్పుడు ఆ జీవిలో ఉన్న సర్వాంశలూ ఆమెవే కదా. రక్ష (రక్షించే), మంత్ర (మంత్రపూర్వక ఆవాహన), ప్రాణ (సకల జీవులకీ మూలమైన ప్రాణం), కళా (అన్ని కళలు), విశ్వ (విశ్వమంతటా వ్యాపించిన), విద్యా (సకల విద్యలు ఇచ్చే), వాగ్వైభవ (మాట్లాడే తీరు తెలిపే), సంహార (దుష్ట నాశనం), ధార్మిక (ధర్మమార్గాన నడిచేలా చూసే)... అనే నవవిధ శక్తుల సమాహారం జగన్మాత అని పురాణ కథనం. సృష్టికి, దాని గమనానికి దోహదపడే దేవతలందరికీ ఆధారభూతురాలు. ఆమె మహావిద్య, మహామాయ, పూర్ణరూపిణి, ప్రకృతి. అవ్యయ (మార్పు లేనిది) ఇచ్ఛారూపిణి (కోరుకున్న రూపం ధరించేది). వేదగర్భ(వేదాలకు మూలం), సర్వాధిష్టాన (సృష్టి అంతటికీ అధిదేవత)... అని దేవీభాగవత కథనం. ‘నవ’ అనే శబ్దానికి కొత్తది, తొమ్మిది, అనే అర్థాలతో పాటు ‘నూయతే స్తూయతే ఇతి నవః’... స్తుతి చేస్తే సుఖాలనిచ్చేది అనే అర్థం కూడా ఉంది. దేవిని తొమ్మిది రోజుల పాటు నియమ నిష్ఠలతో పూజించే వ్రతాన్ని నవరాత్రి వ్రతం అంటారు. దీన్ని ఆచరిస్తే పాపాలన్నీ హరించిపోయి ముక్తులవుతారు అని పురాణాలు చెబుతున్నాయి

ఆమె శారద:- శరత్కాలం ఆహ్లాదకరమైనది. దేవి అవతరించిది ఈ కాలంలోనే. శరది భవా శారదా... శరత్కాలంలో పుట్టింది కాబట్టి దేవికి శారద అనే పేరు వచ్చింది. ఆమె లోకకంటకులైన రాక్షసులని మట్టు పెట్టింది ఈ నవరాత్రుల్లోనే. సంవత్సరంలో మూడు రకాల నవరాత్రులు జరిపే సంప్రదాయం ఉంది. శ్రీరామ నవమి సందర్భంగా చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, గణేశ చతుర్థి పురస్కరించుకుని భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు. ఆశ్వయుజ మాసంలో శారదను స్తుతించే తొమ్మిది రోజులూ శరన్నవరాత్రులుగా నిర్వహించుకుంటాం. వీటిలో శరన్నవరాత్రులు అత్యంత ప్రశస్తమైనవిగా భావిస్తారు. జగదాధారిణి అయిన జగన్మాతని కొలిచే నవరాత్రులు కావడంతో ఇవి చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో దేవిని పూజిస్తే సంవత్సరమంతా పూజించిన ఫలితం వస్తుందని నమ్ముతారు.

- రమాశ్రీనివాస్‌

ఏంటీ అలంకారాలు?




రన్నవరాత్రులలో అన్ని శక్తి క్షేత్రాల్లోనూ అమ్మవారిని రోజుకొక్క రూపంలో అలంకరిస్తారు. దేవీ భాగవత పురాణం, తంత్రశాస్త్ర గ్రంథాలు ఈ రూపాలకు ప్రామాణికాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ, శ్రీశైలంలోని భ్రమరాంబ, వరంగల్‌ భద్రకాళి తదితర క్షేత్రాల్లో అమ్మవారికి విశేషమైన అలంకారాలు చేసే ఆచారం ఉంది. సాధారణంగా లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపురసుందరి, గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, దుర్గ, మహాలక్ష్మి, మహిషాసుర మర్దిని, మహాకాళి, రాజరాజేశ్వరి రూపాలలో అమ్మ కొలువుదీరతారు. వీటికి పురాణ సంప్రదాయం ప్రామాణికం. విజయవాడ కనకదుర్గ ఆలయంలో ‘స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి’ రూపం కూడా కనిపిస్తుంది. మొదటి రోజు ఈ అలంకారం చేయటం స్థానిక సంప్రదాయం. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి.. ఇవి అమ్మవారి రూపాలు. దశ మహావిద్య స్వరూపాలివి. నవరాత్రి సందర్భంగా శ్రీశైల భ్రమరాంబను ఈ రూపాలతో కొలుస్తారు. వీటికి తంత్రశాస్త్ర గ్రంథాలు ప్రమాణం. మార్కండేయ పురాణం దేవి రూపాలను వేరుగా చెబుతోంది. దీని ప్రకారం మహాకాళి, మహిషాసుర మర్దిని, చాముండి, నంద, రక్తదంతి, శాకంబరి, దుర్గ, మాతంగి, భ్రామరి అనేవి అమ్మ రూపాలు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

దుర్గముడనే రాక్షసుణ్ణి సంహరించిన మాతకు దుర్గ అని పేరు. దుర్గం అంటే కోట. మంచికి పెట్టని కోటలాంటి జగన్మాత సకల శుభాలనూ ఇస్తుందని భక్తుల నమ్మకం. పరతత్త్వానికి, పరమోన్నత వ్యక్తిత్వానికి ప్రతీక అయిన ఈమెను తెలుసుకోవడమే ఆజన్మాంత తపస్సు. అలాంటి దుర్గా స్వరూపాన్ని నవరాత్రుల్లో కొలిచే సంప్రదాయం ఉంది.

1వ రోజు




శైలపుత్రి :- హిమవంతుని కుమార్తె. పర్వత పుత్రి కాబట్టి పార్వతి అనీ పిలుస్తారు. ఆమె వృషభ వాహిని, శూల ధారిణి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తులు నమ్ముతారు. భూ తత్త్వానికి ప్రతీక అయిన ధూసర వర్ణంలో కనిపిస్తారు. అమ్మకు బూడిద రంగు వస్త్రాలను అలంకరిస్తారు.

2వ రోజు




బ్రహ్మచారిణి:- హిమవంతుని కుమార్తె అయిన పార్వతి నారదుని ద్వారా తన గతజన్మ వృత్తాంతాన్ని తెలుసుకుంది. అప్పుడు తాను దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవినని, నారదుని ఉపదేశంతో ఈ జన్మలోనూ శివుని భర్తగా పొందడానికి తపస్సు చేయాలని నిశ్చయించుకుంది. ఆ రూపం బ్రహ్మచారిణి. కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం, తెల్లటి వస్త్రాలతో దర్శనమిస్తుంది. తపస్సు చేసింది కాబట్టి తపశ్చారిణి అనీ పిలుస్తారు. ఈమెను పూజిస్తే వైరాగ్యం, సాధు జీవనం, అన్నింటా విజయం దక్కుతాయని నమ్ముతారు..

3వ రోజు

చంద్రఘంట: తలపై అర్ధచంద్రుడితో దర్శనమిచ్చే తల్లి ఈమె. పది భుజాలు... యుద్ధానికి సన్నద్ధమైనట్లు ధనుస్సు, బాణం, గద, శూలం, ఖడ్గం, పాశంతో దర్శనమిస్తుంది. పద్మం, కమండలం, అభయ హస్తం, వరద హస్తాలతో అలరారుతుందీమె. పౌర్ణమినాటి చంద్రుడిలాంటి గౌరవర్ణంలో దర్శనమిచ్చే అమ్మవారు భక్తుల మనస్సులకు ప్రశాంతతనిస్తారు. ఈ దేవిని పూజించడం వలన ధైర్యం, శత్రువుల్ని జయించే శక్తి కలుగుతుందని నమ్ముతారు.

4వ రోజు

కూష్మాండ:- పృథ్వికి ప్రతీక కూష్మాండం. అంటే గుమ్మడికాయ. సకల సృష్టికీ కారణమైన జగన్మాతను కూష్మాండగా కొలుస్తారు. ఈ రూపంలో దేవికి ఎనిమిది చేతులు. అందువల్ల అష్టభుజాదేవి అనీ పిలుస్తారు. చక్రం, గద, ధనుస్సు, బాణం తదితర ఆయుధాలతో పాటు కమండలం, అమృత కలశం, జపమాల, పద్మం ధరించి దర్శనమిస్తారు. ఈ రూపంలో పూజించడం వల్ల రోగాలు నశించి ఆయురారోగ్యాలు వృద్ధి పొందుతాయి. కర్తవ్య దీక్షకు సూచిక అయిన ఎరుపు రంగు దుస్తులను అమ్మకు అలంకరిస్తారు.

5వ రోజు

స్కందమాత: సింహవాహిని అయిన స్కందమాతది నాలుగు చేతుల రూపం. ఒక చేతిలో కుమారుడైన స్కందుణ్ణి, రెండు చేతుల్లో పద్మాలను ధరించి ఉంటారు. అభయ ముద్రలో దర్శనమిస్తారు. అమ్మను ఈ స్వరూపంలో పూజించడం వల్ల శాంతి, సౌఖ్యం కలుగుతాయని చెబుతారు. ఆకాశానికి, విశాలతత్వానికీ ప్రతీక అయిన నీలం రంగులో అమ్మను భావిస్తారు.

6వ రోజు

కాత్యాయని :- త్రిమూర్తుల తేజంతో అలరారుతుందీ దేవి రూపం. మహిషాసురుణ్ణి సంహరించడానికి ఎత్తిన ఈ అవతారాన్ని ముందుగా కాత్యాయనుడు అనే ముని పూజించడం వల్ల ఈమెకీ పేరు వచ్చింది. నాలుగు చేతులున్న తల్లి వాహనం సింహం. ఒక చేతిలో ఖడ్గం, రెండో చేతిలో కమలం ధరించి దర్శనమిస్తారు. మిగిలిన రెండు చేతులూ వరద ముద్ర, అభయ హస్తంగా ఉంటాయి. కష్టాలు బాధలు తీరాలనే కోరికతో ఈ రూపంలో పూజిస్తారు. ప్రకృతికి ప్రతీక అయిన ఆకుపచ్చ రంగులో దర్శనమిచ్చే తల్లిని పసుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు.

7వ రోజు

కాళరాత్రి :- విరబోసుకున్న జుట్టు, నల్లని మేని ఛాయ, నాలుగు భుజాలతో గార్దభ వాహనంపై ఉంటుంది. అంత భయంకర రూపంలోనూ నాలుగు భుజాల్లో రెండు అభయ హస్తంగా , వరప్రసాద ముద్రలతో దర్శనమిస్తుంది. దుష్టులకు మాత్రమే భయంకరి. శిష్టులకు అభయంకరి అనే భావన ఇమిడి ఉందీ రూపంలో. పాపాలు, గ్రహ బాధలు తొలగిపోవడం ఈ రూపంలో దేవిని పూజించినందుకు ఫలితాలని చెబుతారు. అజ్ఞానానికి, అంధకారానికి ప్రతీక నలుపు. అజ్ఞానాన్ని తొలగించుకుని కొత్త వెలుగుల వైపు పయనించాలని అమ్మ నల్లని మేని రంగులోని ఉపదేశం. ఈమెను ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరిస్తారు.

8వ రోజు

మహాగౌరి :- వృషభ వాహిని. చతుర్భుజాలు కలిగి ఉండే ఈమె చేతుల్లో త్రిశూలం, ఢమరుకం, అభయ ముద్ర, వరప్రసాద ముద్రలతో దర్శనమిస్తుంది. తెల్లని వర్ణంలో అమ్మ కనిపిస్తుంది. శ్వేతవస్త్ర ధారిణి. ఈమెని పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని, శుభాలు కలుగుతాయని చెబుతారు.

9వ రోజు




సిద్ధిదాత్రి :- సర్వసిద్ధులను ప్రసాదించేది కాబట్టి ఈమెకీ పేరు. కమలం ఈమె ఆసనం. నాలుగుభుజాలు కలిగి ఉంటుంది. వాటిల్లో శంఖం, చక్రం,గద, పద్మాలను ధరించి చుట్టూ భక్తులతో కొలువుదీరి ఉంటుంది. ఈ రూపంలో దేవిని పూజించడం వల్ల సర్వసిద్ధులు-శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.