Translate

Thursday, December 19, 2019

అమ్మవారి అర్చనలు

మానవుడు చేసిన కర్మలనునసరించి వారికి సద్గతులు అమ్మవారు కలిగిస్తుంది, సాధకుని యొక్క సాధనను బట్టి అన్నిరకాల ముక్తులను ప్రసాదించే తల్లి ఆ  ముక్తి 5 రకాలు గా వర్ణించ బడింది.

1.మణిపూరంలో దేవిని అర్చించే వారికి “సార్షిరూపముక్తి”.(మణిపూరంలో దేవిని అర్చించేవారు దేవి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకుని ఉంటారు. దీన్ని సార్షిరూపముక్తి అంటారు.)

2.అనాహతంలో దేవిని అర్చించేవారికి “సాలోక్యముక్తి”(అనాహతంలో దేవిని అర్చించేవారు దేవిపట్టణంలోనే నివసించగలుగుతారు.
దీన్ని సాలోక్యముక్తి అంటారు.)

3.విశుద్ధిచక్రంలో దేవిని అర్చించే వారికి 'సామీప్యముక్తి” (విశుద్ధిచక్రంలో దేవిని అర్చించేవారు దేవికి అతిదగ్గరగా సేవకులుగా ఉంటారు.
ఇది సామీప్యముక్తి.)

4.ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించే వారికి “సారూప్యముక్తి”(ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించేవారు వేరే దేహం ధరించి దేవితో సమానమైన
రూపంలో ఉంటారు. ఇది సారూప్యముక్తి.)

5.సహస్రారంలో దేవిని అర్చించే వారికి “సాయుజ్యము”(సహస్రారంలో దేవిని అర్చించేవారు జన్మరాహిత్యం పొందుతారు. వీరికి మరుజన్మ
ఉండదు. ఇది శాశ్వతమైన ముక్తి. సాయుజ్యం.
లభిస్తాయి.)

ఇవేకాక భక్తులకు వారివారి కర్మానుసారము స్వర్గనరకాలు ప్రాప్తిస్తాయి.

స్వర్గసుఖాలు ఎంతకాలం అనుభవించాలి ? తిరిగి ఎప్పుడు జన్మించాలి ? అనేది
నిర్ణయించేది కూడా ఆ పరమేశ్వరీ. ఈ రకంగా ఆ దేవి మానవులకు సద్దతులను ప్రసాదిస్తుంది.

పద్మపురాణంలో చతుర్దశినాడు మూడు కాలములందు దేవిని ఎవరైతే పూజిస్తారో వారు పరాస్థానము పొందుతారు అని చెప్పబడింది.

ఈ విధంగా సాధకుడు చేసే అర్చనా విధానాన్ని బట్టి అతడికి ముక్తి లభిస్తుంది.

🕉️పంచబ్రహ్మలు దేవికి అతి సమీపంలో ఉండి ఆమెను సేవించాలి అనుకున్నటువంటి వారై,
బాగా ఆలోచించి సామీప్యముక్తి పొందినట్లైతే దేవికి అతిసమీపంగా ఉండి ఆమెను
సేవించవచ్చు అని తలపోసి, విశుద్ధిచక్రంలో ఆమెను ఉపాసించారు. అందువల్ల దేవికి
సేవకులుగా, అత్యంతదగ్గరగా ఆమె యొక్క సింహాసనానికి కోళ్ళుగా ఉండగలిగారు.

ఈ విషయాన్ని శంకరభగవత్సాదుల వారు తమ సౌందర్య లహరిలోని 92వ శ్లోకంలో
వర్ణిస్తూ
గతా స్తే మఞ్చత్వం - ద్రుహిణహరిరుద్రేశ్వరభృతః*
*శివస్స్వచ్ఛచ్ఛాయా - కపటఘటిత ప్రచ్ఛదపటః|*
*త్వదీయానాం భాసాం - ప్రతిఫలనరాగారుణతయా*
*‌శరీరీ శృంగారో - రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్‌||92||*

ఓ భగవతీ ! బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అనే నలుగురు నీవు కూర్చునే
సింహాసనానికి కోళ్ళుకాగా సదాశివుడు నువ్వు కప్పుకునే దుప్పటి అయినాడు.
శ్రీచక్రంలో 5 ‌శక్తిచక్రాలు, 4 శివచక్రాలు ఉన్నాయి. ఇందులోని శక్తిచక్రాలే
పంచబ్రహ్మలు. ఈ శక్తిచక్రాలకు పైన దేవి ఉంటుంది. కాబట్టి ఆమె పంచబ్రహ్మాసనస్థితా అనబడుతోంది.
మానవశరీరంలో షట్బక్రాలున్నాయి. ఆ చక్రాలలో ప్రతిదానికీ అధిదేవతలున్నారు.

ఆధారచక్రానికి అధిదేవత - గణపతి
స్వాధిష్టానానికి అధిదేవత - బ్రహ్మ
మణిపూరానికి అధిదేవత - విష్ణువు
అనాహతానికి అధిదేవత - రుద్రుడు
విశుద్ధిచక్రానికి అధిదేవత - మహేశ్వరుడు
ఆజ్ఞాచక్రానికి అధిదేవత - సదాశివుడు

వీటన్నింటికీ పైన సహస్రారంలో ఆ పరమేశ్వరి ఉంటుంది. కాబట్టి ఆమె
పంచటబ్రహ్మాసనస్థితా అని చెప్పబడుతోంది.
 
తనకున్నంతలో పుష్కలంగా పూజాద్రవ్యాలు తెచ్చి పరమేశ్వరిని అర్చించినవాడు శివసాన్నిధ్యం పొందుతాడు.

సద్గతులు రెండు రకాలు 1. ఇహము 2. పరము. ఐహికమైన వాంఛలతో పరమేశ్వరిని అర్చించిన వాడికి భోగభాగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి.

🕉️"దుర్వాస మహర్షి శ్రీచక్ర పూజాఫలాన్ని చెబుతూ"

ఆశానాం పూరకం చక్రం అర్చకానాం అహర్నిశం

ఆ దేవిని ఏ కోరికతో అర్చిస్తే అది తీరుతుంది. ఈ జగత్తులో ఇహం కావాలి అంటే పరం ఉండదు. పరం కావాలంటే ఇహం ఉండదు. అనగా భోగభోగ్యాలు కావాలి అంటే ముక్తి ఉండదు. అలాగే ముక్తికావాలంటే భోగభాగ్యాలను త్యజించాలి.

యత్రా పిభోగో న చ తత్ర మోక్షః యత్రా పి మోక్షోన చ తత్ర భోగః |

శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ ॥

కాని పరమేశ్వరిని అర్చించిన వారికి భోగము, మోక్షము ఏది కావాలంటే అది దొరుకుతుంది.

ఈ జగత్తులో చతుర్దశభువనాలున్నాయి. అందులో భూలోకానికి పైన ఆరు లోకాలున్నాయి. మానవుడు చేసిన కర్మ ఆధారంగా అతడు పైలోకాలకుపోతాడు. అవన్నీ సద్గతులే.

మానవుడు తాను చేసిన కర్మఫలాన్ని బట్టి ఉత్తరజన్మ పొందుతాడు. లోకంలో 84 లక్షల రకాల జీవరాసులున్నాయి. క్రిమికీటకాలు, పశువులు, పక్షులు, జంతువులు, మృగాలు, కుక్కలు, పిల్లులు చివరకు మానవుడు అన్ని జన్మలలోకి మానవజన్మ
దుర్లభమైనది.

Monday, December 16, 2019

శివ ప్రదక్షిణ విధానము

వృషం చండం వృషంచైవ సోమసూత్రం పునర్వ్రుషమ్ । 
చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వ్రుషమ్ ॥ 
శివ ప్రదక్షిణే చైవ సోమసూత్రం న లంఘయేత్ । 
లంఘనాత్సోమసూత్రస్య నరకే పతనం ధ్రువమ్ ॥

విశేష ఫలితములను అనుగ్రహించు శ్రీ శివ ప్రదక్షిణ విధానము :

ధ్వజస్తంభము నుండి సవ్యంగా చండీశ్వరుని వద్దకు వెళ్ళి నమస్కరించవలెను.
మరల, ధ్వజస్తంభము వద్దకు వచ్చి నమస్కరించుకొని, సోమసూత్రము వరకు వెళ్ళవలెను.
అదే విధంగా, ధ్వజస్తంభము వద్దకు వచ్చి నమస్కరించుకొని, చండీశ్వరుని చేరవలెను.
మరల ధ్వజస్తంభము మీదుగా (మధ్యలో ఆగకుండా) సోమసూత్రమును చేరవలెను.
అదే విధంగా, ధ్వజస్తంభము మీదుగా (మధ్యలో ఆగకుండా) చండీశ్వరుని చేరి నమస్కరించవలెను.
మరల, ధ్వజస్తంభము వద్దకు వచ్చి నమస్కరించుకోనిన  ప్రదక్షిణ పూర్తి యగును.
(ధ్వజస్తంభము లేని యడల, నందీశ్వరుని నుండి ఈ ప్రదక్షిణ చేయవచ్చును.)
శివ ప్రదక్షిణ చేయునప్పుడు సోమసూత్రమును దాటరాదని తెలిసికొనవలెను.
జగత్కళ్యాణ కారకులైన శ్రీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము చేత, జనులందరూ ధర్మాచరణ కల్గినవారై, ఆనందమగు జీవితమును పొందుదురు గాక !
విశ్వస్య కళ్యాణమస్తు :)

శ్రీ మహా మృత్యుంజయ స్తోత్రం


ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిమ్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

గంగాధరం మహాదేవం సర్పాభరణ భూషితం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

అనాధ పరమానందం కైవల్యపద గామినం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

స్వర్గాపవర్గ దాతారం సృష్టి స్థితి వినాశనం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఉత్పత్తి స్థితి సంహార కర్తారం గురుమీశ్వరం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తస్య మృత్యు భయం నాస్తి- నాగ్నిచోరభయం క్వచిత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శతావర్తం ప్రవర్తవ్యం సంకటే కష్ట నాశనం 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధి ప్రదాయకం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతం
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

జన్మ మృత్యు జరారోగైః పీడితం కర్మ బంధనైః
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

తావతస్త్వద్గత ప్రాణః త్వచ్చిత్తోహం సదామృడ 
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యం మనుం జపేత్
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

నమశ్శివాయ సాంబాయ హరయే పరమాత్మనే
ప్రణత క్లేశనాశాయ యోగినాం పతయే నమః ||

మృకండు సూను మార్కండేయ కృత
మృత్యుంజయ స్తోత్రం సంపూర్ణమ్.

Saturday, December 14, 2019

పుట్టినరోజు నాడు పఠించవలసిన శ్లోకం (సప్త చిరంజీవులు)


అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః |
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః ||

అశ్వత్థామా, బలిచక్రవర్తి, వ్యాసుడూ (కృష్ణద్వైపాయనుడు) హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీరు ఏడుగురు చిరంజీవులు. హనుమంతుడు భవిష్య బ్రహ్మ; బలి చక్రవర్తి భవిష్య ఇంద్రుడు.

1.   *అశ్వద్దామ* :- ద్రోణాచార్యుని కుమారుడు,మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు. ఇతడు చిరంజీవి.

2. *బలి* :- ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు,ఇంద్రుని జయించినవాడు,వామనమూర్తి కి మూడడుగుల భూమిని దానం చేసి,అతని చే పాతాళమునకు తొక్కబడిన వాడు . కానీ ఇతని సత్య సంధతకు మెచ్చుకున్న వామనుడు గధాధారిగా ఇతని వాకిటికి కావాలి కాచేవాడు .ఇతడు చిరంజీవి. ఇతని సత్య సంధతకు మెచ్చిన మహా విష్టువు ఈమన్వన్తరములో దైత్త్యేద్రత్వమును , పై మన్వంతరములో దేవేంద్ర పదవిని అనుగ్రహించాడు .

3 *వ్యాసుడు* :- సత్యవతీ పరాసరుల కుమారుడు.కృష్ణ ద్వాయపాయనముని అని పిలవబదేవాడు. అష్టదశాపురాణాలను, బ్రహ్మసూత్రములను,భారత భాగవతములను ఇంకనూ అనేక తత్వ గ్రంధములను రచించాడు. వేదాలను విడబరచిన వానిని వ్యాసుడు అని పేర్కొంటారు. ఒక్కొక్క యుగములో ప్రశంసింప బడినారు .

4. *హనుమంతుడు* :- కేసరి భార్య అగు అంజన పుత్రుడే హనుమంతుడు. భర్త ఆజ్ఞా ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో వున్నా శివుని శక్తిని ఆమెకు ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టినాడు .సూర్యుని శిష్యుడు ఈ రామ భక్తుడు .పరమేశ్వరుని అవతారముగా కొలవబదినవాడు హనుమంతుడు .రావణాది రాక్షసులను ఎదిరించి, సీత ఉనికిని తెలుసుకొని లంకేస్వరుని హతమార్చతంలో శ్రీ రామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమ .మహా భారతయుడంలో అర్జునిని ధ్వజమున వెలసి పాండవుల విజయమునకు కూడా దోహదకారి అయినాడు .ఇతడు చిరంజీవుడు .రామ భాక్తాగ్రేస్వరుడైన ఆంజనేయుడు చిరంజీవిగా తన భక్తులకు సకల శుభాలను అనుగ్రహిస్తూ ఉంటాడు.

5. *విభీషణుడు* :- కైకసికిని విస్వబ్రహ్మకు కలిగిన మూడవ కుమారుడు . బ్రహ్మపరమున ఈతడు సుశీలుడైనాడు. ఈయన భార్య పరమ అనే గాంధర్వ స్త్రీ .రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి , సన్మార్గము గూర్చి చెప్పేవాడు .సముద్రమును దాటుటకు శ్రీ రామునకు ఉపాయము చెప్పినవాడు .రావణుని హతమార్చుటకు ఉపాయము చెప్పినవాడు.రావణుని అనంతరం లంకాధిపతి అయినాడు.ఇతడు చిరంజీవుడు.

 6 *కృపుడు* :- శరద్వంతుని కుమారుడు .శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు ,ఇంద్రుడు ఇతని తపస్సును భగ్నము చేయుటకై ఒక అప్సరసను పంపినాడు .ఆమెను చూడగానే యితడు కామ పరవశుడై ఆ చోటును వొదిలి మరియొక చోటుకు వెళ్ళినాడు ఆ సమయమున కల్గిన కుమారుడు కృపుడు . కృపునితో పాటుగా సరద్వాన్తునికి మరియొక ఆడపిల్ల కల్గినది .ఆపిల్లలను వదిలి తపస్సుకి మరిఒక చోటికి వెళ్ళినాడు .అటువంటి సమయమున వేటకు వచ్చిన శంతనుడు .ఈ పసికందులను చూచి కృపతో పెంచినాడు .అందులకే వీనికి క్రుపయని క్రుపుదని పేర్లు వచ్చినవి.శరద్వంతుడు కృపునకు ఉపనయాదికములను చేసి ధనుర్వేదమును నేర్పినాడు .భీష్ముని కోర్కె మన్నించి ధర్మజాడులకు ధనుర్విద్యను నేర్పినాడు .భారత యుద్ధం లో దుర్యోధనుని పక్షమును నిలిచి యుద్ధం చేసినాడు . యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు. దృతరాష్ట్రుడుతో కూడి తపోవనమునకు వెళ్ళినాడు రాబోవు సుర్యసవర్నిక మన్వంతరములో సప్తరుషులలో కృపునకు ఒక స్థానము పొందు వాడుగా వున్నాడు .ఇతడు చిరంజీవుడు.

 7. *పరశు రాముడు* :- ఇతడు రేణుకా జమదగ్నుల కుమారుడు .తండ్రి ఆజ్ఞను మన్నించి తల్లిని కూడా సంహరించినాడు.ఇతనిని మెచ్చుకొన్న తండ్రి వరం కోరుకొమ్మనగా తల్లిని బ్రతికించమన్నాడు .తన సోదరులకు తండ్రివలన శాపమును తొలగింప చేసాడు జమదగ్నికి తాత బృగు మహర్షి ,ఆ మహర్షి ఉపదేశంతో హిమాలయమునకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేసినాడు .ఈశ్వరుడు బోయవాని వేషమున వొచ్చి పరశురాముని పరీక్షించినాడు .శివుని ఉత్తర్వుతో తీర్ధ యాత్రలు చేసినాడు ,శివ అనుగ్రహముతో భార్ఘవాస్త్రమును పొందినాడు

నిత్యం వీరిని స్మరించడం వల్ల ఆనందంగా వందేళ్ళు జీవిస్తారు. ఎనిమిదో వానిగా మార్కండేయున్ని స్మరించడం ద్వారా మృత్యు భయం వీడిపోతుంది

Friday, December 13, 2019

చండీహోమం

చండీహోమం ఎవరికి సంబంధించినది.

ఇది బ్రాహ్మణులకి..మాత్రమే..కాదు..
అన్ని వర్ణాల వారికి..సంబంధించినది.

చండీ ఆరాధన కలకత్తా దగ్గరలోని గిరిజన జాతులవారు ప్రారంభించారని పెద్దలు చెప్పియున్నారు,
వారి వద్ధనుండే చండీహోమం ఆరాధన,,హోమం బయల్పడినాయి.
కాలక్రమేణా బ్రాహ్మణులు,,పండితులు కూడా చండీహోమం చేయనారంభించారు. 

లక్ష్మీ,,సరస్వతీ,,పార్వతీదేవి,,ఈ ముగ్గరు శక్తుల కలయికతో ఏర్పడినదే మహాచండీ..
ఈమె హోమం చేయడంవల్ల సమస్త బాధలు నివారణమవుతాయి.
వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.
శత్రువులు నశిస్తారు.
పరప్రయోగాలతో బాధపడేవారు..
తరచుగా కుటుంబంలో మరణాలు సంభవిస్తున్నవారు..
అకారణంగా కోర్టు  కేసులలో ఇరుక్కుంటున్నవారు.
ఇంకేమైనా ఇతరత్రా సమస్యలతో బాధపడతున్నవారు చండీహోమాన్ని చేయించుకోవడం వల్ల చండీమాత అనుగ్రహంతో త్వరితగతిని వాటినుండి బయటపడతారు,, 

చండీమాత ఉగ్రరూపమే కాళికామాత,,
ఈమె శాంతరూపంలో.. 
మంగళచండి,
సంకటచండీ,,
రణచండీ,,
ఓరైచండీ గా 
పూజలందుకుంటారు..  
చండీహోమం ఈరోజున చాలా ఖర్చుతో కూడుకుని ఉన్నది,, 

ప్రముఖ దేవాలయాలలో చేయించుకునే చండీహోమం వల్ల కేవలం 5% మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. ఎవరైనా చేయించుకునే ఆర్థికస్తోమత ఉన్నవారు ఎవరికివారుగా..
ఆర్థికస్తోమత తక్కువగా ఉన్నవారు నాలుగు కుటుంబాలవారు కలిసికట్టుగా గాని చండీహోమం చేయించుకోవచ్చు,, 

చండీ హోమము ఎందుకు చేయాలి..!
అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే.! 
చండీ మాత ఓ ప్రచండ శక్తి. 
భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. 
సృష్టి జరగడానికి, 
అది వృద్ధి చెందడానికి, 
తిరిగి లయం కావడానికి 
అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. 

ఆమె ఆదిశక్తి, 
పరాశక్తి, 
జ్ఞానశక్తి, 
ఇచ్చాశక్తి, 
క్రియాశక్తి, 
కుండలినీ శక్తి! 
అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం.

లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. 
లోక కల్యాణం కోసం, 
విశేష కార్యసిద్ధి కోసం 
సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు 
మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం 
అనాదిగా వస్తోంది. 
ఆదితత్త్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య.

అది లలితా పారాయణం, 
చండీ పారాయణం 
అని రెండు రకాలు. 

బ్రహ్మాండ పురాణం, 
దేవీ భాగవతం 
లలితాదేవి మహిమలను చెబితే, 
మార్కండేయ పురాణం 
చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. 

చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతోపాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి.

చండీ హోమం లో ఉన్న మంత్రాలు & అధ్యాయాలు.

చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే, ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, 
అర్థశ్లోక, 
త్రిపాద శ్లోక 
మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. 

బ్రాహ్మీ, 
నందజా, 
రక్తదంతికా, 
శాకంబరీ, 
దుర్గా, 
భీమా, 
భ్రామరీ 
అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహత్య్మ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి 
దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది. 
ఇది శాక్తేయ హోమం కనక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది.

దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా, 
13 అధ్యాయాలుగా ఉంటుంది. 
తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 
రెండో భాగంలో మూడు అధ్యాయాలు, 
మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, 
మహిషాసుర సంహారం, 
శుంభనిశుంభుల వధతోపాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. 

సప్తశతిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు. 
పూజ, 
పారాయణ, 
హోమం. 
ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. 
పారాయణలో దశాంశం హోమం, 
దశాంశం తర్పణం ఇస్తారు. 

చండీ హోమానికి సంబంధించి..
నవ చండీ యాగం, 
శత చండీ యాగం, 
సహస్ర చండీ యాగం, 
అయుత (పది వేలు) చండీ యాగం, 
నియుత (లక్ష) చండీ యాగం, 
ప్రయుత (పది లక్షలు) చండీ యాగం ఉంటాయి.

చండీ పారాయణ వలన సమాజానికి జరిగే మేలు:💐
ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. 
దుఃఖం అనేది రాదు. 
ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. 
లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది.

కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. 
ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, 
గ్రహాల అనుకూలతకు, 
భయభీతులు పోవడానికి, 
శత్రు సంహారానికి, 
శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు.

వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట.

ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని, 

ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, 

మను చండి (చతుర్దశ చండి)తో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. 

ఇక, శత చండి చేస్తే కష్టాలు, 
వైద్యానికి లొంగని అనారోగ్యం, 
ధన నష్టం తదితరాలు తొలగుతాయి. 

సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. 
కోరికలు నెరవేరతాయి. 

లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. 
దీనినే నియుత చండి అంటారు. 
ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు..

Wednesday, December 11, 2019

దత్త జయంతి

దత్త జయంతి

శ్రీమహావిష్ణువు ఇరవై ఒక్క అవతారాల్లో దత్తావతారం ఆరోదని భాగవత పురాణం చెబుతోంది. దత్తరూపం అసామాన్యమైంది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించి, ఆవిర్భవించినదే దత్తావతారం. మార్గశిర శుద్ధ పూర్ణిమనాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. ‘దత్తం’ అంటే ఇచ్చినవాడని. అత్రి కుమారుడు కావడంతో ఆత్రేయుడైనాడు. దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. ఇరవై నలుగురిని తన గురువులుగా భావించి, సేవించాడు. కార్తవీర్యుడు, పరశురాముడు, యదువు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోకప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్య బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు మొదలైన గ్రంథాలు రచించాడు.

దత్తుడు గొప్ప అవధూత. మహాజ్ఞాని. చిరంజీవి. యుగయుగాలకు ఆయన ఆదర్శమూర్తి. లోకగురువైనాడు. ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేశాడు. జాతి శ్రేయస్సుకోసం జ్ఞానబోధ చేశాడు. దత్తాత్రేయుడు ఆదిగురువైన పరబ్రహ్మ స్వరూపుడు. శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్యరూప విలక్షణమూర్తి. ఆయన బోధలు లోకకల్యాణ కారకాలు. భూమి నుంచి సహనశీలత, గాలినుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం నేర్చుకోవాలని ఉద్బోధించిన మార్గనిర్దేశకుడు. అగ్నినుంచి నిర్మలత్వాన్ని, సముద్రం నుంచి గాంభీర్యాన్ని, కపోతంనుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలన్నాడు. కొండచిలువలా భ్రాంతిలో పడకూడదన్నాడు. స్పర్శకు దూరంగా ఉండటం మిడత నుంచి, ఏనుగు నుంచి పట్టుదల, చేపనుంచి త్యాగచింతన నేర్చుకోవాలి. మానావమానాలకు సమస్పందన అలవరచుకోవాలి. సాలెపురుగు నుంచి సృష్టి స్థితిలయకారకుడు పరమాత్మేనని తెలుసుకోవాలి. సీతాకోక చిలుకలా ఆత్మానందాన్వేషణ అలవరచుకోవాలి. చంద్రుడి నుంచి వృద్ధిక్షయాలు శరీరానికే కాని ఆత్మకు కావని గ్రహించాలి. ఆర్తులను కాపాడే చింతనను నీటినుంచి గ్రహించాలి. చీమలా జిహ్వ చాపల్యానికి లోనుకారాదని తెలుసుకోవాలి. ఇవన్నీ తనకు గురువులుగా ప్రకటించిన జ్ఞానానందమయుడు- జగద్గురువు దత్తాత్రేయ స్వామి!

దత్తాత్రేయుడు సతీమదాలస ముద్దులపట్టి అలర్కుడికి యోగవిద్య నేర్పాడు. ఓంకారోపాసనా విధానాన్ని ప్రబోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యను, ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞాన రహస్యాన్ని ప్రసాదించాడు. త్రిమూర్తుల అనుగ్రహ అవతారం కావడంతో, దత్తుడిరూపం మూడు శిరసులతో సందేశాత్మకమై ప్రకాశిస్తోంది.

దత్తుడు పదహారు అంశలు కలవాడని ‘దత్తపురాణం’ చెబుతోంది. శ్రీపాదవల్లభులు, శ్రీనృసింహ సరస్వతి, శ్రీ అక్కల్‌కోట మహరాజ్‌, శ్రీమాణిక్య ప్రభువు, షిరిడీ సాయిబాబా, గజానన మహరాజ్‌, శ్రీకృష్ణ సరస్వతీ మహరాజ్‌, వాసుదేవానంద సరస్వతీ మహరాజ్‌ దత్తావతారాలుగా వెలసినట్లు దత్తచరిత్ర చెబుతోంది. దత్తపురాణ గ్రంథాన్ని దీక్షగా పారాయణం చేస్తారు.

మత్స్య పురాణం, స్మృతి కౌస్తుభంలో దత్తచరితం విస్తృతంగా ఉంది. ఈ పూర్ణిమనాడు కొన్ని ప్రాంతాల్లో చంద్రపూజ చేస్తారని నీలమత పురాణం వివరిస్తోంది. ఈ రోజున ఆగ్నేయ పురాణ గ్రంథం దానం చేస్తే సతతం మేలు కలుగుతుందని పురాణోక్తి. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమి ‘కోర్ల పూర్ణిమ’గా ప్రసిద్ధి చెందింది. మహామార్గశీర్ష పేరుగల ఈ పున్నమిరోజున నరకపూర్ణిమావ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి హారాష్ట్రలో దత్తజయంతిని భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకొంటారు. దత్తుడు ‘ఉగ్రదేవత’ అని గర్గసంహిత చెబుతోంది. దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికర దినమని చెబుతారు. ఆ స్వామికి ఇష్టమైన వృక్షం మేడివృక్షం. ప్రేమ, అహింస, భూతదయ, త్యాగశీలత, ఆత్మజ్ఞానం మనుషులకు రక్షణ కవచాలన్న దత్తాత్రేయుడి సందేశాలు సర్వదా ఆచరణీయం.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Sunday, December 8, 2019

రోగ నిరోధక మంత్రాలు

రోగ నిరోధక మంత్రాలు కూడా ఉంటాయా ఇప్పటి రోజుల్లో అనీ అనుకోవచ్చు..కానీ  నిజం..
రోగ  నిరోధక మంత్రాలు కచ్చితంగా ఉన్నాయి.
అసలు మంత్రం అనేది ఎలా నిర్మించ బడినది 
ఒకదానికి ఒకటి ఒక ఫార్ములా లాగా పనిచేసే విధంగా నిర్మించ బడినది, 

మంత్రం చదివేటప్పుడు ఆ శబ్దనికి ప్రతిస్పందించే ప్రకృతిలోని కొన్ని శక్తులు మన శరీరాన్ని ఆకర్షిస్థాయి..
అప్పుడు మనకు రోగ నిరోధక శక్తి మనో ధైర్యం, 
బలం లభిస్తుంది..

ఒకప్పుడు వైద్యులు ఔషధం తో పాటు ఒక మంత్రం కూడా ఇచ్చే వాళ్ళు ఔషధం సేవించే టప్పుడు ఆ మంత్రాన్ని చదివి ఔషధం తీసుకోమని చెప్పే వాళ్ళు, 
తేలు మంత్రం..పాము మంత్రంతో ప్రాణాలు నిలుపుకున్న పల్లె ప్రజలు ఉన్నారు.. 
ఇప్పుడు అలాంటి కొన్ని మంత్రాల గురించి తెలుసుకుందాము...

1. నారాయణీయం
(ఇది గురువాయురు కృషుడి గురించి రాసిన వేయి పద్యాల అద్భుతమైన వర్ణన ) 
ఈ శ్లోకాలు జబ్బుతో ఉన్న వారు కానీ లేక వారి కోసం ఎవరు చదివినా భయంకరమైన  ప్రాణాపాయ జబ్బులు, కాన్సర్, దీర్ఘకాలిక రోగాలు నశించి పోతాయి.
ఒకసారి ఆ పుస్తకం తెచ్చుకుని ప్రయత్నం చేయండి, కృషుడి పైన పద్యాలు వాటి అర్థాలు ఎంతో భక్తి భావనతో భావోద్వేగాలు కలిగిస్తుంది... 
చక్కటి ఆరోగ్యం ఆలోచన కలిగిస్తుంది..

2. వైద్యనాద్ స్త్రోత్రం
శివయ్య గొప్ప వైద్యుడు కూడా   
పురాణకాలం నుండి వైద్యంకోసం శివుని ఆరాధించేవారు, చర్మ వ్యాధులు ఇన్ఫెక్షన్ తో బాధపడే వారు 
ప్రదోష కాలంలో ఈ వైద్యనాద్ స్త్రోత్రం, 
శివ స్త్రోత్రాలు పారాయణం ప్రతి రోజు చేయాలి, సోమవారంనాడు శివునికి వాయుప్రతిష్ఠ చేసిన లింగానికి వారి చేత్తో అబీషేకం చేయాలి, 
ఆరుద్ర నక్షత్రం రోజు ప్రదోష కాలంలో మట్టితో శివలింగాన్ని చేసుకుని, బియ్యం పిండి, గంధం, విభూది వీటితో 
ఒక్కో దానితో ఓం నమః శివాయ అని 108 సార్లు 
అర్చన చేసి, నైవేద్యం పెట్టి వైద్యనాద్ స్త్రోత్రం పఠించి  హారతి ఇవ్వాలి ,
కాసేపు  ధ్యానం చేసి ప్రసాదం భక్తిగా స్వీకరించాలి.. సంకల్పంతో మీకు ఆరోగ్యం ప్రసాదించమని వేడుకోవాలి, ప్రసాదం తినేటప్పుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుని తినాలి.. 
తర్వాత మీరు చేసిన మట్టి శివలింగాన్ని ప్రవహిస్తున్న నీటిలో కలపాలి 
చెరువు అయినా పర్వాలేదు... 
అలా నిమర్జన చేయడంలోనే మీకు మీ బాధ నుండి 
చాలా ఉపశమనం లభిస్తుంది.. 
ఇలా ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు చేస్తూ రావాలి 
మీకు పూర్తి ఆరోగ్యం లభించాక శివాలయంలో
అభిషేకం చేయించండి...

3.చిన్న చిన్నవి తరచూ వచ్చే జ్వరాలు , కీళ్ల నొప్పులు, ఊబకాయం , తిన్నది అరగక పోవడం, 
వంటికి పట్టకపోవడం, తరచు నీరసం లాంటి 
కారణం తెలియని రోగాలు మంచి ఉపాయం హనుమంతుడి గుడి సందర్శన, హనుమాన్ చాలీసా రోజు చదవడం..!

4. రాహుకాలం లో దుర్గ దేవి, సుబ్రహ్మణ్యస్వామి , కాలభైరవ స్వామి శ్లోకములు చదువుతూ ఉన్నా అకారణంగా వచ్చే భయాలు, నిద్రలో ఉలిక్కి పడటం, తరచు క్రిందపడటం ఇలాంటి బాధలు ఉండదు,.

5. ఏ ఔషధం సేవిస్తున్న కూడా
"ఓం నమో భగవతే వాసుదేవాయా " అని సేవిస్తే 
ఆ మందు మీకు బాగా పనిచేస్తుంది.!

6.మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఆలోచన వస్తుంది మంచి జీవితం ఉంటుంది.
ఎవరికి భారం కాకుండా ప్రాణం పోవాలి చివరి రోజుల్లో... అంటే రోజూ ఐదు తులసి ఆకులు తినండి, 
కాసేపు తులసికి దగ్గరగా కూర్చోండి.
తులసి మొక్క ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది, 
రేఖీ, విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే గుణం తులసికి ఉంది , ఇలాగే ఆవుకి కూడా.
అవకాశం ఉన్న వారు కాసేపు గోసాలలో గడపండి..
వైద్యం చేయించు కుంటూ ఇవి పాటిస్తే 
త్వరగా గుణం ఉంటుంది.
మానవ ప్రయత్నం మానకూడదు.
దైవ బలం వదులు కొకూడదు.