Translate

Tuesday, September 22, 2020

హనుమంతుడికి తమలపాకులతో పూజ


ఒకసారి సీతాదేవి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన హనుమంతుడు శ్రీరాముడిని ”స్వామీ ఏమిటది ? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు.అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే హనుమంతుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమల పాకులను కట్టుకొని గంతులు వేస్తూ ఆనందంగా వచ్చాడు. హనుమంతుడు ఎక్కువగా తమలపాకు తోటలలోనూ,అరటి తోటలలోనూ విహరిస్తారు. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీ దళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష పరిహారం అవుతుంది.

మరో కథ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతాదేవికి హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే హనుమంతునికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.

హనుమంతుని పూజించటం వలన కలుగు ప్రయోజనాలు..!

1. లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఉన్న వారికి త్వరగా గుణం కనిపడుతుంది.

2. హనుమంతుని(ఆంజనేయస్వామి)కి తమల పాకుల మాల వేస్తే మంత్ర సంబందమైన పీడలు తొలగిపోతాయి.

3.సంసారంలో ప్రశాంతత లేని వారు తమల పాకుల మాల వేస్తే సంసారంలో సుఖం లభిస్తుంది.

4. చిన్న పిల్లలు కొందరు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. ఇలాంటి వారు తమలపాకుల మాల వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు.

5. వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే  తమలపాకుల మాల వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది

6.  శనైశ్చర స్వామి వల్ల ఇబ్బంది ఉన్నవారు హనుమంతుని (ఆంజనేయ స్వామి)కి తమలపాకుల మాల వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది

7. సుందర కాండ పారాయణం చేసి  తమలపాకుల మాల వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.

8. వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్ధించి తమలపాకుల మాల సమర్పించి, ప్రసాదం తీసుకుంటే విజయం మీదే అవుతుంది.

9.హస్త,మృగశిర నక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం.

10. అరటి తోటల హనుమంతునికి (ఆంజనేయునికి) పూజ కోటిరెట్లు ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు. శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు(ఆంజనేయుడు) అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది.

11. ఆంజనేయునికి సింధూరం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నావని సీతాదేవిని  అడుగుతాడు. అందుకు సీతమ్మ నవ్వుతూ ఈ పాపిట బొట్టువలన నేను రామప్రేమను పొందానని చెప్పింది. ఈ బొట్టు రాముల వారికి చాలా ఇష్టమని చెప్పారు. దాంతో వెంటనే హనుమంతుడు (ఆంజేయుడు) సిందూరాన్ని తన శరీరమంతా పూసుకున్నాడు. ఆయనకు ఆపాదమస్తకం రోమాలు ఉండడం చేత ఆ సిందూరం వెంటనే రాలిపోయేది. అప్పుడు హనుమంతుడు నూనెతో కలిపిన గంగ సిందూరాన్ని శరీరమంతా రాసుకున్నాడు. ఇలాంటి అమాయకపు పనిచేసిన హనుమంతుని చూసిన రాముల వారు, నిన్ను సింధూర రూపంతో ఎవరైతే సేవిస్తారో వారికి నేను ప్రసన్నుడును అవుతాను అన్నారు. అటువంటి భక్తులకు సమస్త దోషాలు తొలగి సుఖశాంతులు పొందుతారని వరం ఇచ్చారు. అందుకే హనుమంతుని శరీరమంతా సిందూరం రాసి ఉంటుంది.

12. హనుమంతునికి వడ మాల ఎందుకు వేస్తారో తెలుసా?

అంజనాదేవికి, వాయు భగవానునికి జన్మించిన ఆంజనేయుడు బాల్యంలో అకాశంలో ఉన్న సూర్యుడిని పండుగా భావించి ఎగిరి పట్టుకోవాలనుకున్నాడు.  వాయుపుత్రుడు కావడంతో అకాశానికి ఎగిరాడు. సూర్యుడిని పట్టుకునేందుకు వాయుపుత్రుడు ఇలా ఆకాశానికి ఎగిరెళ్ళడం చూసిన దేవతలంతా విస్తుపోయారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసిరి ఆంజనేయుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అపుడు వజ్రాయుధం హనుమంతుడి దవడ తాకింది. హనుమంతుని దవడ కి గాయమేర్పడి నది. అందుచేత సుందరుడు అనే పేరుగల ఆంజనేయుడు హనుమంతునిగా పిలుస్తారు.బాల హనుమంతుడు సూర్యుడిని పట్టేందుకు వెళ్తున్న సమయం సూర్యగ్రహణం కావడంతో, సూర్యుడిని పట్టుకునేందుకు రాహువు కూడా ప్రయాణమయ్యాడు. అయితే వాయుపుత్రుని వేగానికి రాహువు తట్టుకోలేక, సూర్యుడిని పట్టలేకపోయాడు. సూర్యగ్రహణాన్ని అడ్డుకొని వేగంతో తనను మించిన హనుమంతుడి సాహసాన్ని చూసి నివ్వెరపోయిన రాహువు ఆంజనేయుడికి ఒక వరం ఇచ్చాడు.

రాహువుకు ప్రీతికరమైన మినుములతో వడలు (గారెలు) చేసి వాటిని మాలలాగా తయారుచేసి ఎవరు హనుమంతునికి సమర్పిస్తారో వారికి రాహుగ్రహంతో ఏర్పడే బాధలు, దోషాల నుండి విముక్తుల్ని చేస్తానని, వరమిచ్చి ఆశీర్వదిస్తాడు. రాహువుకు ప్రీతికరమైన మినుముతో వడలు  (గారెలు) చేసి తన శరీరం పోలిక అంటే పాములాంటి ఆకారంలో మాలగా వడలను హనుమంతునికి సమర్పిస్తే, రాహు దోషాలు పూర్తిగా తొలగిపోతాయని విశ్వాసం. అందుచేతనే మినప పప్పు వడలు తయారుచేసి 54, 108 లేదా 1008 అనే సంఖ్యలో హనుమంతునికి మాలగా సమర్పించిన వారికి రాహు దోషాలుండవని చెబుతారు.🌹🌹🙏🙏🌹🌹

శ్మశానవాసి (హిందూ ధర్మం వాట్సాప్ గ్రూప్ నుండి)



శవాలను దహనం చేసే ఈ ప్రాంతంలో శివుడు ఎందుకు కొలువై ఉంటాడో సాక్షాత్ పార్వతీదేవికి సందేహం వచ్చింది. ఇదే విషయాన్ని మహాశివుడి వద్ద పార్వతీ దేవి స్వయంగా ప్రస్తావిస్తుంది. దీనికి శివుడు ఏమని సమాధానం ఇచ్చారంటే... 
 
పార్వతీ...! శ్మశానంలో నేనేమీ ప్రయత్నపూర్వకంగా కూర్చోవడం లేదు. లోకంలో ఉగ్రమైన భూతములన్నీ 
కొలువైవున్న ప్రాంతం శ్మశానం. 
ఇక్కడ ఏ ఒక్క పుణ్యకార్యం జరుగకుండా భూతప్రేతాత్మలు అడ్డుకుంటున్నాయి. 
దీన్ని గమనించిన బ్రహ్మ.. స్వయంగా నా వద్దకు వచ్చి ఓ విన్నపం చేశారు. లోకంలో మంగళ కార్యాలేవీ జరగడం లేదు. దీనికి కారణం ఉగ్రభూతములన్నీ లోకంలో కొలువై ప్రతి మంగళకార్యాన్ని అడ్డుకుంటున్నాయి. 
 
పైగా, ఈ లోకంలో సంచరించే ప్రతి బిడ్డా మీ బిడ్డలే కదా. అన్ని ప్రాణులకు తల్లిదండ్రులు మీరే కదా. మీ పిల్లలు చేసే తప్పొప్పులను సరిదిద్దుతూ వారిని అదుపు ఆజ్ఞల్లో ఉంచేందుకు శ్మశానంలోనే కొలువై వుండాలని ప్రార్థించాడు. అందువల్లే నేను శ్మశానంలో కొలువైవున్నాను అని చెప్పాడు. 

ఇది మొదటి కారణం కాగా, మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి. జీవించి వున్న సమయంలో నేనే గొప్ప అని జబ్బలు చరుచుకునే ధనవంతుడు, ఆకటితో అలమటించే కడుపేదవాడు చనిపోయాక వచ్చేది శ్మశానానికే. అంటే.. ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమే. ఈ విషయాన్ని లోకానికి చాటిచెప్పేందుకే శ్మశానంలో ఉంటున్నాడు పరమేశ్వరుడు. 
 
చివరి కారణం... జీవించివున్నంతకాలం నావాళ్లూ నావాళ్లూ అంటుంటారు. తీరా చనిపోయాక శ్మశానంలో ఒంటరిగా వదిలిపెట్టి వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. అలా శ్మశానంలో వదిలి వెళ్లిన వారికితోడుగా నేనున్నాను అని చెప్పేందుకే అక్కడ నివశిస్తున్నట్టు పార్వతికి శివుడు చెపుతాడు. 
 
అసలు ఈ లోకమే ఓ శ్మశానం. చనిపోయేవాడు శ్మశానంలోకి వచ్చి చనిపోతున్నాడా? లేదు కదా. గృహాల్లో, ఆస్పత్రుల్లో, రోడ్లపై, పార్కుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ చనిపోతున్నారు. అంటే ఈలోకమంతా ఓ శ్మశానమే. ఇలా చనిపోయిన ప్రాణులన్నీ ఈ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రాంతం శ్మశానం. ఈ ప్రాంతంలో నేను నివశిస్తున్నాను కాబట్టే శ్మశానం అన్నారు. పైగా, ఈ లోకంలో మృత్యుభీతి లేకుండా చనిపోయే ప్రాంతమేదైనా ఉందంటే అది *’కాశీ’* అని పార్వతికి శివుడు వివరిస్తాడు...

Saturday, September 19, 2020

పెళ్లి లో కన్యను గంప లో మేనమామ ఎందుకు తెస్తాడు

వెదురు బుట్ట తయారుచేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని గౌరీ పూజ చేయిస్తారు. బుట్టలో కూర్చుని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో కూర్చుంటుంది. 

గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది. 
సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు. 
సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు. 
అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. 
ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి! 

 పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది. 
అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది. 
ఆమెయే ఆతని లక్ష్మి. 
అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం. 
అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి. 
అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది. 
ఆమె లక్ష్మియై నారాయణుడిని చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది. 

ఆమె ‘నిత్యానపాయినీ’. 
ఆమె ఎన్నడూ విష్ణువును విడిచి పెట్టి ఉండదు. 
శ్రీరమ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా 
చారజనంబు గాఁగ, 
విరజానది గౌతమిగా,
వికుంఠము 
న్నారయ భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో 
ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ!కరుణాపయోనిధీ!
అని గోపరాజు గారు. 

 శ్రీమహా విష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది. 
ఆయన కృష్ణ భగవానునిగా వస్తే ఆమె రుక్మిణీ దేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది. ఎన్నడూ విడిచిపెట్టదు. 
అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది. 

ఆడపిల్ల – ఆడ అంటే తెలుగులో అక్కడ. 
అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది. 
ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది. 

ఇక్కడ లక్ష్మి పుట్టింది. 
అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను. 
ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది. 
అందుకే ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి. 

కాబట్టి వెదురు బుట్ట పద్మానికి సంకేతం. 
ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి. ఆయన వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞములు చేయాలి.

 ఎంతో ధార్మికంగా సంపాదించాలి. 
ఆయనకి సంతానం కలగాలి. 
ఆయన సంతోష పడిపోవాలి. 
ఆయన తండ్రి కావాలి,
 తాత కావాలి. 
ముత్తాత కావాలి. 

ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి. తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది. 
ఆ సంతానం నానుండి రావాలి. ‘ధర్మ ప్రజాపత్యర్థం’ ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నానుండి సంతానం కలగాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే. నడిచి వెళ్ళకూడదు వేదికమీదకి. లక్ష్మి అంటేనే ఐశ్వర్యం.
 లక్ష్మిగా ఆమె వేదికమీదకి వెళ్తోంది నారాయణ మూర్తిని పొందడానికి. పద్మంలో వెళ్ళాలి. 
అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం. 
ఈ ప్రేమ ఎవరిది? మా అక్కచెల్లెళ్ళది. మా అక్క చెల్లుళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు. 
తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు. 
ఈమె నీ లక్ష్మి. 
ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోవక్కరలేదు. నారాయణుడి ప్రక్కన లక్ష్మియే. అందుకు ఒకపీట మీదకి మారిపోతారు ఇద్దరూ. 
మారేవరకు బుట్టలోనే కూర్చుంటుంది. 
బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌడ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు.
 అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకు వెళ్తారు. 
మేనమామలు ప్రేమైక మూర్తులు. 

లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం. 
నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది. 

నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి.
 అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లను తెచ్చారు. 
లక్ష్మీ దేవిని తెచ్చారు నారాయణుడు అని నా కొడుకుని చూసి. 
మీరు పదికాలాలు బ్రతకండి అని ఆయుః కారకం కనుక అంచు ఉన్న పంచెల చాపు మేనమామలకి ఇస్తారు. 
మేనమామలే ఎందుకు తేవాలి? తెలుగునాట ఒక లక్షణం ఉంది. 
అక్క చెల్లెళ్ళకి ఆడపిల్ల పుడితే ఒరేయ్ నీకు భార్య పుట్టింది అంటారు. ఎన్నడూ నేను నా మేనకోడలిని ఆ దృష్టితో చూడలేదు. ఆమెను లక్ష్మిగానే చూశాను. నారాయణుడిని చేరుతుంది అనుకున్నాను. 
భర్తృ  భావనతో చూడలేదు.

 పవిత్రభావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చాను అని తెస్తాడు. 
అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం. 

అందుకే పెళ్ళి కూతుర్ని బుట్టలో తేవడం మేనమామలు తెస్తే పెళ్ళి అయిపోయాక? నిజంగా వాళ్ళు ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమెని నడిపించి కానీ, ఇంకొకలా కానీ వెళ్ళకుండా ఊర్లో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇచ్చి పంపించాలి. 

అధవా ఎద్దులబండిలో తీసుకు వెళ్తారు. 
వాహనంలో వెళ్ళాలి తప్ప నడిచి వెళ్ళకూడదు. 

ఆడపిల్లని అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి జాతి మన జాతి.

Friday, September 18, 2020

అధిక ఆశ్వయుజమాసం లో ద్వాదశ రాశులు వాళ్ళు చదవాల్సిన శ్లోకాలు

మేషరాశి 

ఓం శం శరవణభవ

వృషభ రాశి

శ్రీ మాత్రే నమః

మిధున రాశి

ఓం నమో నారాయణాయ

కర్కాటక రాశి

ఓం శ్రీం శ్రీయై నమః

సింహ రాశి

ఓం నమో భగవతే వాసుదేవాయ

కన్యా రాశి

ఓం గం గణపతే నమః

తులా రాశి 

ఓం రాజమాతంగ్యై నమః

వృశ్చిక రాశి

ఓం నమో నారసింహాయ

ధనస్సు రాశి

ఓం నమః శివాయ

మకర రాశి

శ్రీ హనుమతే నమః

కుంభ రాశి 

శ్రీం శివాయ నమః

మీన రాశి

ఓం నమో భగవతే రుద్రాయ
----------------------------------------
పైన తెలిపిన శ్లోకాలను ఉదయాన్నే వారి నిత్యదేవతార్చన ముగించుకుని రోజుకి కనీసం 108సార్లు పారాయణం చేసినట్లయితే అనుకున్న పనులు తొందరగా నెరవేరుతాయి

Sunday, September 13, 2020

హనుమాన్ చాలీసా


ఏదైనా పనిలో విజయం సాధించాలనుకుంటే, మంగళ, గురు, శని లేదా 
మూలా నక్షత్రం ఉన్నరోజు 
రాత్రులు 108 సార్లు ఇది చదివితే మంచిది. 
సరియైన శ్రద్ధ, విశ్వాసంతో హనుమంతుడి అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు.

హనుమాన్ ..చాలీసా.
దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి |
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ||
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార |
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ 

ధ్యానమ్
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ||
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||

చౌపాఈ
జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||

రామదూత అతులిత బలధామా |
అంజని పుత్ర పవనసుత నామా || 2 ||

మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ ||3 ||

కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా || 4 ||

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై |
కాంథే మూంజ జనేవూ సాజై || 5||

శంకర సువన కేసరీ నందన |
తేజ ప్రతాప మహాజగ వందన || 6 ||

విద్యావాన గుణీ అతి చాతుర |
రామ కాజ కరివే కో ఆతుర || 7 ||

ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామలఖన సీతా మన బసియా || 8||

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా |
వికట రూపధరి లంక జరావా || 9 ||

భీమ రూపధరి అసుర సంహారే |
రామచంద్ర కే కాజ సంవారే || 10 || 

లాయ సంజీవన లఖన జియాయే |
శ్రీ రఘువీర హరషి ఉరలాయే || 11 ||

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ || 12 ||

సహస వదన తుమ్హరో యశగావై |
అస కహి శ్రీపతి కంఠ లగావై || 13 ||

సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా || 14 ||

యమ కుబేర దిగపాల జహాఁ తే |
కవి కోవిద కహి సకే కహాఁ తే || 15 ||

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజపద దీన్హా || 16 ||

తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయే సబ జగ జానా || 17 ||

యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ || 18 ||

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |
జలధి లాంఘి గయే అచరజ నాహీ || 19 ||

దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || 20 || 

రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆఙ్ఞా బిను పైసారే || 21 ||

సబ సుఖ లహై తుమ్హారీ శరణా |
తుమ రక్షక కాహూ కో డర నా || 22 ||

ఆపన తేజ తుమ్హారో ఆపై |
తీనోఁ లోక హాంక తే కాంపై || 23 ||

భూత పిశాచ నికట నహి ఆవై | 
మహావీర జబ నామ సునావై || 24 ||

నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా || 25 ||

సంకట సేఁ హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై || 26 ||

సబ పర రామ తపస్వీ రాజా |
తినకే కాజ సకల తుమ సాజా || 27 ||

ఔర మనోరధ జో కోయి లావై |
తాసు అమిత జీవన ఫల పావై || 28 ||

చారో యుగ పరితాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా || 29 ||

సాధు సంత కే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే || 30 ||

అష్టసిద్ధి నవ నిధి కే దాతా |
అస వర దీన్హ జానకీ మాతా || 31 ||

రామ రసాయన తుమ్హారే పాసా |
సాద రహో రఘుపతి కే దాసా || 32 ||

తుమ్హరే భజన రామకో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై || 33 ||

అంత కాల రఘువర పురజాయీ |
జహాఁ జన్మ హరిభక్త కహాయీ || 34 ||

ఔర దేవతా చిత్త న ధరయీ |
హనుమత సేయి సర్వ సుఖ కరయీ || 35 ||

సంకట కటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బల వీరా || 36 ||

జై జై జై హనుమాన గోసాయీ |
కృపా కరో గురుదేవకీ నాయీ || 37 ||

జో శత వార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహా సుఖ హోయీ || 38 ||

జో యహ పడై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీశా || 39 ||

తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహా డేరా || 40 ||

దోహా

పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ |
రామ లఖన సీతా సహిత .హృదయ బసహు సురభూప్ ||

సియావర రామచంద్రకీ జయ | 
పవనసుత హనుమానకీ జయ | 
బోలో భాయీ సబ సంతనకీ జయ | 
జై శ్రీరామ్..!!

సకల బాధా నివారణకు నవగ్రహపీడాహరస్తోత్రం

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః ।
విషమస్థానసమ్భూతాం పీడాం హరతు మే రవిః ॥ ౧॥

రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః ।
విషమస్థానసమ్భూతాం పీడాం హరతు మే విధుః ॥ ౨॥

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా ।
వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః ॥ ౩॥

ఉత్పాతరూపో జగతాం చన్ద్రపుత్రో మహాద్యుతిః ।
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః ॥ ౪॥

దేవమన్త్రీ విశాలాక్షః సదా లోకహితే రతః ।
అనేకశిష్యసమ్పూర్ణః పీడాం హరతు మే గురుః ॥ ౫॥

దైత్యమన్త్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ।
ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః ॥ ౬॥

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః ।
మన్దచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః ॥ ౭॥

మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః ।
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ ॥ ౮॥

అనేకరూపవర్ణైశ్చ శతశోఽథ సహస్రశః ।
ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః ॥ ౯॥

॥ ఇతి బ్రహ్మాణ్డపురాణోక్తం నవగ్రహపీడాహరస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

రాశి ఫలాలు (సెప్టెంబరు 13-19)

మేషం

శుభయోగాలున్నాయి. అనేక విధాలుగా కలసి వచ్చే కాలం నడుస్తోంది. మంచి పనులు చేసి అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపార బలం పెరుగుతుంది. స్వయంకృషితో మంచి ఫలితాలను సాధిస్తారు. పదిమందికీ ఉపయోగపడే పనులు చేస్తారు. సంకల్పం ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్యంపైన దృష్టి నిలపండి. సూర్యస్తుతి ఉత్తమం.


వృషభం

శ్రమ పెరుగుతుంది. ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కాలం సహకరించడంలేదు. ఓర్పుతో లక్ష్యాన్ని చేరాలి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ చూపండి. అవసరాలకు ధనం లభిస్తుంది. అపార్థాలకు అవకాశం ఉంది. మొహమాటంతో సమస్యలొస్తాయి. ముందస్తు ప్రణాళిక కాపాడుతుంది. ఒత్తిడిని జయించగలిగితే ఫలితం వస్తుంది. గణపతి ధ్యానం మంచిది.


మిథునం

సర్వ శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి. కాలాన్ని అభీష్టసిద్ధికై ఉపయోగించండి. ఉద్యోగ, వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. అదృష్టవంతులు అవుతారు. గృహ, భూ, వాహనాది యోగాలు సిద్ధించే కాలమిది. పనుల్లో పురోగతి ఉంటుంది. వారం మధ్యల్లో శుభవార్త వింటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. ఇష్టదైవస్మరణ మేలు చేస్తుంది.


కర్కటకం

ప్రతి అడుగూ ఆలోచించి వేయాలి. ఒత్తిడిలో పొరపాటు జరిగే అవకాశముంది. ఉద్యోగ ఫలితం మిశ్రమం. వ్యాపార నష్టం సూచితం. ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. మిత్రుల వల్ల లాభపడతారు. ఖర్చు పెరిగే అవకాశముంది. నూతన బాధ్యతలు వస్తాయి. కొన్ని విషయాల్లో స్పష్టత లోపిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సూర్యధ్యానం సదా రక్షిస్తుంది.


సింహం

అదృష్టవంతులవుతారు. అద్భుతమైన శుభయోగాలున్నాయి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. మీ కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. పదవీ లాభం సూచితం. వ్యాపారం బాగుంటుంది. కలసివచ్చే నిర్ణయం తీసుకుంటారు. ఇంటా బయటా గుర్తింపు లభిస్తుంది. కొన్ని ఆటంకాల నుంచి త్వరగా బయటపడతారు. శివారాధన శ్రేష్ఠం.


కన్య

ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఆవేశపరిచే సంఘటనలు ఉన్నాయి. వారం మధ్యలో ఆర్థికలాభం సూచితం. విజయావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో తగినంత గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వారం చివర శుభం జరుగుతుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఆదిత్య హృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది.


తుల

పనులు పూర్తికావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సొంత నిర్ణయం మేలుచేస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితముంది. వ్యాపారపరంగా విఘ్నాలు ఎదురవుతాయి. ఆటుపోట్లు తట్టుకుని అద్భుతమైన భవిష్యత్తును సాధిస్తారు. వారం మధ్యలో ఒక ప్రమాదం నుండి బయటపడతారు. ఇష్టదేవతను స్మరించండి. కోరిక నెరవేరుతుంది.


వృశ్చికం

అద్భుతమైన శుభ ఫలితాలుంటాయి. అన్ని విధాలాపైకి వచ్చే యోగముంది. గొప్ప కార్యాలు సాధించే అవకాశముంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. బంధుమిత్రుల సూచనలు పనిచేస్తాయి. చంచలత్వం లేకుండా మనోబలంతో ముందుకు సాగండి. మేలు జరుగుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.


ధనస్సు

ముఖ్యకార్యాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. శాంతంగా మాట్లాడాలి. మిత్రులద్వారా శుభం జరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. వారాంతంలో కార్యసిద్ధి లభిస్తుంది. ఆంజనేయస్వామి స్మరణ మేలుచేస్తుంది.


మకరం

విఘ్నాలను అధిగమిస్తారు. ఆర్థికనష్టం జరగకుండా చూడాలి. నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగపరంగా ఆటంకాలు ఎదురైనా శుభమే జరుగుతుంది. వ్యాపారంలో విఘ్నాలు పెరుగుతాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విశ్రాంతి అవసరం. ఇబ్బంది పెట్టేవారున్నారు. మౌనం రక్షిస్తుంది. వారాంతంలో విజయం లభిస్తుంది. శనిధ్యానం శుభప్రదం.


కుంభం

అదృష్టయోగముంది. కొన్ని పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది. తెలివితేటలతో పెద్దలను మెప్పిస్తారు. ఉద్యోగంలో అనుకున్నది జరుగుతుంది. శత్రుదోషం తొలగుతుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. మిత్రబలం పెరుగుతుంది. శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతతతో ఉత్తమ జీవితాన్ని అనుభవిస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి. మనశ్శాంతి లభిస్తుంది.


మీనం

అన్నీ శుభాలే ఉన్నాయి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగఫలం అద్భుతం. ధనధాన్య లాభాలుంటాయి. రుణ సమస్యలు రానీయకండి. విఘ్నాలను సమర్థంగా ఎదుర్కొంటారు. కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. గృహ, వాహన లాభాలు సూచితం. సుఖ సౌఖ్యాలుంటాయి. మంచి భవిష్యత్తును పొందుతారు. ఈశ్వరారాధన మంచిది.



షడ్ర్గహ స్వక్షేత్రస్థితి



అందరికీ నమస్కారం ప్రస్తుతం స్వక్షేత్ర గ్రహస్థితి గురించి అరుదైన చర్చ జరుగుతోంది.
అయితే స్వక్షేత్ర గ్రహస్థితి కొన్ని వందల సంవత్సరాల వరకు ఏర్పడదు ? ఇప్పుడే ఇది లభించింది మరలా ముందుకు వెళ్ళినా రెండుమూడు వందల సంవత్సరాలకు లేదు వెనక్కు రెండు వందల సంవత్సరాలు వెళ్ళినా లేదు? ఇది వాస్తవ మేనా?

ఇక్కడ మనం ముందుగా గ్రహములయొక్క గమనాన్ని ఆలోచించాలి.

🌞సూర్యుడుని గమనిస్తే ప్రతినెలకు ఒకరాశిలో సంచరిస్తాడు సంవత్సరకాలంలో 12 రాశులు సంచరిస్తాడు ప్రతి సంవత్సరం అగష్డు 16 తేది షుమారు ఒకరోజు అటు ఇటుగా తన స్వక్షేత్రమైన సింహ రాశిలోకి వస్తాడు.🌞

🌝చంద్రుడు షుమారు రెండురోజుల ఒకపూట ఒక్కొక్క రాశిలో ఉంటూ నెలలోనే పన్నెండు రాశులను పూర్తి చేస్తాడు అలా నెలకు ఒకసారి తన స్వక్షేత్రంలోకి వస్తాడు 🌝

🌸ఆగష్టు 16 తర్వాత పునర్వసు నాలుగోపాదం నుంచి ఆశ్లేష నక్షత్రం వెళ్ళేవరకు చంద్రుడు కర్కాటకంలో రవి సింహంలో ఉంటారు వీరిద్దరూ ప్రతిసంవత్సరం వారివారి స్వక్షేత్రాలలో ఒకేసారి ఉండటం  జరుగుతుంది.🌸
              

బుధుడు ఒకరాశిలో నెల రోజులు ఉంటాడు రోజుకి ఒకడిగ్రీ సంచరిస్తాడు సూర్యసంక్రమణానికి దగ్గరలో షుమారు ఒకటిరెండు రోజుల వ్యవధి తో ఒక పది రోజులలోపు బుధ సంక్రమణం జరుగుతూ ఉంటుంది.

అలా చూసినప్పుడు రవి చంద్ర బుధులు ప్రతి సంవత్సరం వారి వారి స్వక్షేత్రాలలో ఏక కాలంలో  ఉండటం జరుగుతుంది.

గురుడు సంవత్సరానికి ఒకరాశిలోనికి మారతాడు ఇలా గురుడు తన స్వక్షేత్రములయిన ధనస్సు మీనములలోకి ఒకసారి వస్తే మళ్ళీ రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది.
            

🌸ఇలా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చంద్ర, బుధ, రవి, గురులు తప్పక ఒకేకాలంలో వారి స్వక్షేత్రాలలో కలిసే అవకాశం ఉన్నది.🌸

📍శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరములు ఉంటాడు   తన స్వక్షేత్రములైన మకర కుంభములందు ఐదు సంవత్సరములు ఉంటాడు. తదుపరి మరలా మకరానికి రావటానికి తిరిగి మరలా ఇరవై ఏడున్నర సంవత్సరాలు పడుతుంది.📍

ఇక్కడ శని గురు చంద్ర రవి బుధులు  ఒకేసారి స్వక్షేత్రాలలో కలిసే అవకాశం తక్కువగా ఉంటుంది.
              

కుజుడుని పరిశీలిస్తే ఒకరాశిలో 45 రోజులు ఉంటాడు తన స్వక్షేత్రములయిన మేష వృశ్చికములో ఉన్న సమయంలో కొన్ని గ్రహాలు స్వక్షేత్రంలో ఏక కాలంలో ఉండే అవకాశం ఉంటుంది.

అలానే శుక్రుడు రోజుకు ఒకడిగ్రీ సంచరించి ఒకరాశిలో నెల రోజులు ఉంటాడు తన స్వక్షేత్రములయిన వృషభ తులలలో  ఉన్న సమయంలో కొన్ని గ్రహములు స్వక్షేత్రములో ఏక కాలంలో ఉండే అవకాశం ఉంటుంది.

🌹ఏవైనా మూడు నాలుగు గ్రహముల  వరకు వాటి వాటి స్వక్షేత్రములలో ఏక కాలంలో అతి తక్కువ కాలంలోనే  మనకు కనబడే అవకాశం ఉన్నది.🌹


📍అయితే ఇలా శని గురులు కూడా కలిసి ఉండటం కొద్ది అరుదుగా ఎక్కువ కాలం తీసుకుంటే గాని ఈ  అవకాశం లభించదు‌. అటువంటి అవకాశం ఈసంవత్సరం ఈనెలలో మనకు లభించింది.


🌹సూర్యభగవానుడు సింహరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు

🌹చంద్రుడు కర్కాటక రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు

🌹కుజుడు మేష రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు.

🌹బుధుడు కన్య రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు.

🌹గురువు ధనస్సు రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు

🌹శని మకర రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు

ఈ కాలాన్ని అందరూ దైవ పరంగా సద్వినియోగం చేసుకంటం మంచిదా ? 
               

🌹ఒకటవ యోగం: 13వ తేదీ వృశ్చిక లగ్నం మరియు వృశ్చిక నవాంశ అనగా వర్గోత్తమాంశకాలం ఉదయం 11:36 నుండి 11:51 వరకు. 

🌹రెండవ యోగం: 14వ తేదీ వృశ్చిక లగ్నం మరియు వృశ్చిక నవాంశ అనగా వర్గోత్తమాంశకాలం ఉదయం 11:32 నుండి 11:47 వరకు. 

🌹మూడవయోగం: 15 వ తేదీ వృశ్చిక లగ్నం మరియు వృశ్చిక నవాంశ అనగా వర్గోత్తమాంశకాలం ఉదయం 11:28 నుండి 11:43 వరకు. 

🌸ఈకాలంమంచిదా అంటే మంచిదే.
ఈ సమయంలో చేసే దీపారాధన, ధ్యానము, జపం పూజ, అధిక ఫలితాలనుకలిగిస్తాయా అంటే భగవంతునికి ఎప్పుడు చేసినా విశేషమే. భక్తితో ఎప్పుడు చేసినా ఆఫలితాలు కలుగుతాయి. 

కాని మనందరి నైజం ఏదో ఒక ప్రత్యేకత దానివలన ఏదో వస్తుంది అంటే అప్పుడు భగవధ్యానం పూజ చేస్తాం. ఇలా మంచి గ్రహ స్థితిలో అయినా అందరూ ప్రార్ధిస్తే ఆలాభం కలుగుతుంది అని చెప్తారు పెద్దలు.🌸

ఇక్కడ ఈ అరుదయిన స్థితి జాతక భాగానికి చెప్పినదే కాని ప్రత్యేకంగా శాస్త్రంలో ఆరాధనా విధానాలకు ఈ కాంబినేషన్ కు సంబంధం చెప్పలేదు. 

జ్యోతిష్య పరంగా మనం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే సదుద్దేశ్యంతో అందరూ సుఖంగా శుభంగా ఉండాలనే సద్భావనతో కొద్దిగా  విశేషంగా కొన్ని వందల సంవత్సరాలకు గానీ లభించదూ అని చెప్తారు.
అయితే ఈ అవకాశం మాత్రం అరుదుగా లభించేదే.

2020 సెప్టెంబర్ 3 తారీఖు నుండి స్వక్షేత్ర పంచ గ్రహ కూటమి మొదలైంది. 2020 సెప్టెంబర్ 16 వరకు ఈ పంచ గ్రహ కూటమి ఉంటుంది.
13,14,15లలో షడ్గ్రహ కూటమి ఉంది.

Saturday, September 12, 2020

కాలభైరవాష్టకం

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ |
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 ||

భానుకోటి భాస్వరం భవబ్ధితారకం పరం
నీలకంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం |
కాలకాల మంబుజాక్ష మస్తశూన్య మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 ||

శూలటంక పాశదండ పాణిమాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 3 ||

భుక్తి ముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్ |
నిక్వణన్-మనోజ్ఞ హేమ కింకిణీ లసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 4 ||

ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశ మోచకం సుశర్మ దాయకం విభుమ్ |
స్వర్ణవర్ణ కేశపాశ శొభితాంగ నిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5 ||

రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్ట దైవతం నిరంజనమ్ |
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్ర భూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 6 ||

అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనమ్ |
అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 7 ||

భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుమ్ |
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 8 ||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్య వర్ధనమ్ |
శోకమోహ లోభదైన్య కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్ ||