Translate

Wednesday, December 23, 2020

ముక్కోటి ఏకాదశి విశిష్టత

పురాణాల ప్రకారం.. వేదాలను దొంగిలించిన ఇద్దరు రాక్షసుల (మధు, కైటభ)ను శ్రీమహావిష్ణువు వధించారు. తర్వాత వారికి మోక్షాన్ని ప్రసాదించగా.. వారు వైకుంఠంలోని ఉత్తర మార్గం ద్వారా వెళ్లి స్వామివారి ఎదుట మోకరిల్లారు. ఈ ముక్తి ప్రాప్తి తమకే కాదు, సౌరమాన మార్గశిర మాస శుక్ల పక్ష ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న ప్రాణికోటి అందరికీ ప్రసాదించాలని ఆ అసురులు కోరారు. అందుకు విష్ణుమూర్తి సమ్మతించారు. అందుకే మన సంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఇంతటి ప్రాశస్త్యం!

No comments: